చౌకధరలో విమానయాన్ని కల్పించే సంస్థగా పేరొందిన ఇండిగో విమానయాన సంస్థ మరో మారు తమ ప్రయాణికులకు బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద మొత్తం 12 లక్షల సీట్లను అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకోచ్చింది. కేవలం రూ.1,212 ధరకే విమానాయాన్ని కల్పించింది. ఈ ధరలు ఇవాళ్టి (జులై 10) నుంచి నాలుగు రోజులు (అంటే జులై 14 వ తేదీ వరకు) మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ ప్రకారం.. జులై 25, 2018 నుంచి మార్చి 30, 2019 మధ్య ఏ తేదీకైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఇండిగో నెట్వర్క్ లోని మొత్తం 57 నగరాల మధ్య ప్రయాణానికి ఈ రాయితీ వర్తిస్తుందని, అంతర్జాతీయ ప్రయాణానికి కూడా తక్కువ ధరలో టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. ఎస్బీఐ కార్డు ద్వారా కనీసం రూ.3000 ట్రాన్సాక్షన్ జరిపే వారికి రూ.500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వస్తుందని తెలిపింది. కనిష్టంగా 25 శాతం రాయితీని ఇండోగో ఈ ఆఫర్ కింద తమ కస్టమర్లకు అందిస్తుంది.
ఇండిగో చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ విలియం బౌల్టర్ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 4వ తేదీకి ఇండిగో 12 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మా నెట్వర్క్లోని 57 నగరాల మధ్య చౌకగా ప్రయాణించేందుకు 12 లక్షల సీట్లను తక్కువ ధరలకు విక్రయిస్తున్నాం. భారత విమానయానంలో ఇంత భారీగా తక్కువ ధరకే టికెట్లను విక్రయిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆఫర్ జులై 13, 2018తో ముగుస్తుంది’’ అని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more