విజయవాడ పోలీసులపై ఈ మద్యకాలంలో విమర్శలు అధికమవుతున్నాయి. ఇటీవల ఓ గ్రామ సర్పంచ్ తన భర్తపై పిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని అమె స్వయంగా అరోపించగా, తాజాగా.. తన మాజీ ప్రియుడిపై పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని టీవీ నటి అరోపిస్తున్నారు. అధికార బలం, అర్థం బలం వున్న వారిపై కేసులు పెట్టేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తుండగా, ఓ వైపు రెండేళ్ల క్రితం కేసులోనే అధికార పార్టీ నేతలను కూడా జైలుకు పంపించి సీఐడీ ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు తీసుకోని పోలీసులపై వేటు కూడా వేసిన ఘటనలను బెజవాడ పోలీసులు మర్చిపోతున్నారు.
అర్ధరాత్రి రోడ్డుపై తన బట్టలు చించి పరుగులు పెట్టించిన మాజీ ప్రియుడు ఫిరోజ్ ఖాన్, అతని తాజా ప్రియురాలు కీర్తీరెడ్డిలపై పోలీసులు ఇంతవరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని బాదితురాలు టీవీ నటి షేక్ సమీర మీడియా ముందు వాపోయింది. తనకు ఫిరోజ్ కు మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వెల్లడించిన ఆమె, తమది గుంటూరు జిల్లా అని, టీవీల్లో నటిస్తూ, దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నానని చెప్పింది. గుట్కా వ్యాపారం చేస్తున్న విజయవాడకు చెందిన ఫిరోజ్ ఖాన్ పరిచయం కాగా, తామిద్దరం కొంతకాలం ప్రేమించుకున్నామని చెప్పింది. అతను అండగా ఉంటాడని నమ్మానని వెల్లడించింది.చేతిపై బ్లేడ్ గాయాలు చూపుతున్న సమీర
టీవీ సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని తనను ఫిరోజ్ దారుణంగా మోసం చేశాడని, మనస్పర్థలు వచ్చి తామిద్దరం విడిపోయామని చెప్పింది. ఆ తరువాత కీర్తితో ఫిరోజ్ పరిచయం పెంచుకున్నాడని, తన చేతులపై బ్లేడుతో కీర్తే గాట్లు పెట్టిందని చెబుతూ వాటిని మీడియాకు చూపింది. తనను గంటపాటు అర్ధనగ్నంగా రోడ్డుపై నిలబెట్టారని, తననుంచి లక్షన్నర విలువ చేసే వాచీ, రెండు సెల్ ఫోన్లను లాక్కెళ్లారని వాపోయింది. పోలీసులు ఇంతవరకూ వారిని అరెస్ట్ చేయలేదని, తన పలుకుబడితో పోలీసులను ఫిరోజ్ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించింది. ఇప్పటికీ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ, ఫిరోజ్ కు, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డును వినిపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more