తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తూ ఇందుగలరు అందులేరన్న సందేహము లేకుండా ఎక్కడ సిసిటీవీ ఫూటేజీలు పరిశీలించినా.. అందందు కనబడే వారే చెడ్డీ గ్యాంగ్ దొంగలు అన్నట్లుగా తమ ఉనికి చాటుకుంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. హైదరాబాద్, కర్నూలు పట్టణంలో సంచలనం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మరోమారు వార్తల్లోకి వచ్చింది. మంగళవారం రాత్రి సంగారెడ్డి పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. అపార్టుమెంట్లు టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా.. అక్కడ కూడా తమను గుర్తించే శత్రువులున్నారని పారిపోయింది.
వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, సంగారెడ్డి రూరల్ పోలిస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని పోతిరెడ్డిపల్లిలో తమ ఉనికి చాటుకునేందుకు వచ్చిన చెడ్డీ గ్యాంగ్ దొంగలు.. స్థానికంగా వున్న శ్రీనిలయం అపార్టుమెంటులో దొంగతనానికి ప్రయత్నించి విఫలమైంది. ఆ దృశ్యాలు అపార్టుమెంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మూడు అపార్టుమెంట్లలో దొంగతనానికి ప్రయత్నించిన చెడ్డీ గ్యాంగ్.. సీసీ కెమెరాలు ఉండటంతోనే అక్కడి నుంచి జారుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
సరిగ్గా రెండు రోజలు క్రితం అనగా జూన్ 10న హైదరాబాద్ లోని నిజాంపేటలో కలకలం రేపిన ఈ గ్యాంగ్.. నిజాంపేట గ్రామంలోని బండారీ లేఅవుట్ కాలనీ రోడ్డు నెంబర్ 5లోని శ్రీరామ నిలయం అపార్టుమెంటులోకి దొంగతనానికి పాల్పడేందుకు యత్నించింది. కాగా, అక్కడ కూడా తమకు ఎదురుగా సీసీ కెమెరాలు కనిపించడంతో భయంతో వెంటనే పారిపోయారు. వాచ్ మెన్ గదిలో వుండగానే అతని గది బయల గడియపెట్టడంతోనే చెడ్డీ గ్యాంగ్ ఇంకా నగరంలోనే సంచరిస్తున్నారన్న అనుమానాలు బలపడ్డాయి. అయితే పోలీసులు ఇలా అలోచిస్తారనే వారు సంగారెడ్డి వైపుకు పయనమయినట్లు తెలుస్తుంది.
ఇక అంతకుముందు గత నెల 21న తెల్లవారుజామున జీడిమెట్ల పీఎస్ పరిధి గాజులరామారంలోని ఓ అపార్టుమెంటులో తచ్చాడిన చడ్డీ గ్యాంగ్ అనంతరం దుండిగల్ పీఎస్ పరిధిలోని శ్రీరాంనగర్లో ఓ అపార్టుమెంట్లోకి వెళ్లింది. అదే అపార్టుమెంట్లో నివసిస్తున్న జీడిమెట్ల కానిస్టేబుల్ ఆంజనేయులు అప్పుడే విధులు ముగించుకుని ఇంటికిరావడంతో చెడ్డీ గ్యాంగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతన్ని గాయపరిచిన దొంగలు పారిపోయారు. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేదు. మరి వీళ్ల అటను ఇంకెన్నాళ్లు కట్టిస్తారో పోలీసులకే తెలియాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more