తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో దారుణం జరిగింది. రాజధాని ప్రాంతంలోని తిరువళ్లూరులో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే మరో ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి చదివి ఇంటిపట్టునే వుంటున్న బాలికను అమె తరగతికే చెందిన విద్యార్థి ఓ నిర్మానుష్య ప్రాంతంలోని గదికి తీసుకెళ్లి బంధించి అమెపై అత్యాచారం చేశాడు. అతనే కాకుండా అతని స్నేహితులు కూడా ఆ బాలికపై 21 రోజుల పాటు పలు పర్యాయాలు అత్యాచార పర్యాన్ని సాగించారు. చివరకు అమె మరీ దయనీయంగా కనబడటంతో అమెను ఓ బస్టాండు వద్ద వదిలి వెళ్లిపోయారు. అయితే అమెపై అత్యాచారం చేసిన వారిలో అమెతో కలసి చదువుకున్న విద్యార్థులే వుండటం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్లూరులో రోజు కూలి పనులు చేసుకునే దంపతుల కుమార్తె పదో తరగతి వరకు చదివింది. ఆ తర్వాత చదువును ఆపేసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో తనతో పాటు చదివిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఆమెను పలు చోట్లకు తీసుకువెళుతూ మద్యం, గంజాయి అలవాటు చేశాడు. ఈ క్రమంలో పలుమార్లు ఆ యువకుడు బాలికతో లైంగిక వాంఛలు కూడా తీర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో, మే నెల 5న బాధితురాలు అదృశ్యమైంది. అన్నిచోట్ల వెతికిన తల్లిండ్రులు, చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో బాలిక కోసం పోలీసులు గాలిస్తుండగా... బస్టాండు వద్ద మత్తులో ఉన్న స్థితిలో బాధితురాలు కనిపించింది. ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు అమెను అస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడే అమెను విచారించగా, తన క్లాస్ మేట్ అయిున యువకుడు తనను నమ్మించి తనకు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి నిర్మానుష్యంగా వున్న ఏరియాలోని ఓ గదిలోకి తీసుకెళ్లి తనను బంధించాడని చెప్పింది. గత నెల 4 నుంచి అతనితో పాటు తనతో చదువుకున్న క్లాస్ మేట్స్ తో కలసి తనపై అత్యాచారం చేయించాడని తెలిపింది. దీంతో ఇప్పటివరకు పోలీసులు అరుగురిని అదుపులోకి తీసుకున్న న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు పుళల్ జైలుకు తరలించారు. మిగతావారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more