టెలికమ్యూనికేషన్ రంగంలోకి లేటుగా వచ్చినా.. లేటెస్ట్ అంటూ మార్కు వేసుకుని సంచలనాలకు తెరలేపిన రిలయన్స్ జియో.. రావడంతోనే తన కస్టమర్లకు డబుల్ ధమాకా అఫర్ ను అందించింది. ఓ వైపు వాయిస్ కాలింగ్ ను పూర్తిగా ఉచితం చేసి.. తమ సంస్థ వాయిస్ కాలింగ్ ను పూర్తి ఉచితం చేస్తుందని, వాయిస్ కాలింగ్ కు ఒక్క రూపాయి కూడా తీసుకోదని ప్రకటించి.. ఇక డేటాను కూడా అత్యంత చౌకధరకు అందించి భారతీయులకు ఇంటర్నెట్ అన్నది సునాయాసంగా మార్చింది. ఇక ఏడాదిన్నర కాలంలో పది కోట్ల మంది కస్టమర్లను తన ఖాతాలో వేసుకున్న జియో.. తాజాగా మరో అఫర్ తో ముందుకోచ్చింది.
టెలీకమ్యూనికేషన్స్ రంగంలో అగ్రగామిగా వున్న ఎయిర్ టెల్ సంస్థ సెలెక్టడ్ కస్టమర్లకు అందిస్తున్న అదనపు డేటాను రిలయన్స్ జియో.. తారతమ్యాలు లేకుండా తన కస్టమర్లందరికీ అందజేస్తుంది. జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ లపై ఎక్స్ ట్రా 1.5GB డేటా ఇవ్వనున్నట్లు తెలిపింది. మంగళవారం (జూన్-12) నుంచి జూన్ 30 వరకు ఈ ఆఫర్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబుల్ ధమాకా ఆఫర్ తో పాటు, ఈ ఆపరేటర్ కొత్తగా రూ.499 రీఛార్జ్ ప్యాక్ ను కూడా 3 నెలల వాలిడిటీతో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్యాక్ పై రోజుకు 3.5 GB డేటా అందించనున్నట్టు తెలిపింది.
జియో డబుల్ ధమాకా ఆఫర్..
రోజుకు 1.5 GB డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 3GB డేటా పొందనున్నారు.
రోజుకు 2 GB డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5GB డేటా లభ్యం.
రోజుకు 3GB డేటా పొందే రూ.299 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5GB డేటా వస్తుంది.
రోజుకు 4GB డేటా పొందే రూ.509 ప్యాక్ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5GB డేటా లభ్యం.
రోజుకు 5GB డేటా పొందే రూ.799 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5GB డేటా పొందనున్నారు.
దీంతో పాటు 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్ లపై జియో 100 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్ లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ ల కోసం మైజియో యాప్, పేటీఎం వాడుతూ.. ఫోన్ పే వాలెట్ ద్వారానే రీఛార్జ్ చేయించుకోవాలని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more