దేశ రాజధాని ఢిల్లీకి రాష్ట్ర హోదా లేకపోవడంతో.. అక్కడి ప్రజాప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముందస్తుగా అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ అమోదం తప్పనిసరి. అయితే గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వ నియమించే వ్యక్తులే వుంటారు. దీంతో ఢిల్లీలోని ప్రభుత్వంపై తమ అదుపాజ్ఞల్లో వుండే గవర్నర్లతో కేంద్రం కేంద్రపరిపాలిత ప్రాంతాల్లో హవా చలాయించే అవకాశముంది. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై గవర్నర్ అజమాయిషీయే అధికంగా పనిచేయడంతో.. ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం పరఢవిల్లడం లేదనే చెప్పాలి.
అయితే ప్రజా ప్రభుత్వాలు కానీ, కేంద్రం దయాధర్మంతో గవర్నర్లు అయినా వారు కానీ కేవలం ప్రజాహితం కోసమే అలోచిస్తే అసలు ఏ వివాదం తలెత్తే అవకాశం వుండదు. కానీ కేంద్రంలో ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ప్రభుత్వం వుంటే.. ఇక గవర్నర్లు కేంద్ర చెప్పిన దానికే మొగ్గుచూపడం పరిపాటి. ఇలానే ఉంది ఇప్పుడు పరిస్థితి. దీంతో గవర్నర్ ను కలిసి చర్చించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రులు రాజ్ నివాస్ లోని వెయిటింగ్ హాల్ లోనే 24 గంటలుగా గవర్నర్ అనీల్ బైజాల్ కోసం నిరీక్షిస్తున్నా.. గవర్నర్ మాత్రం వారితో మాట్లాడటానికి చోరవ చూపడం లేదు.
తమ నిర్ణయాలపై అమోదముద్ర వేయించుకునే పనిలో భాగంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి నిన్నసాయంత్రం రాజ్ నివాస్ కు వెళ్లారు. అయితే వాటిని నిర్ధ్వందంగా గవర్నర్ తోసిపుచ్చారు. దీంతో వాటిని అమోదించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని సీఎం సహా నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. సీఎం ప్రస్తావించిన మూడు డిమాండ్లలో ఒకటి విధులకు హాజరుకాని ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడం.. రెండవది పేదలకు ఇంటి గడపలకు రేషన్ సరుకులు వెళ్లడం.. వంటి నిర్ణయాలు వున్నాయి.
ఎల్జీ అభ్యంతరం తెలపడంతో వాటికి ఆమోదం తెలిపేవరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని మంత్రులు రాజ్ నివాస్ లోని వెయిటింగ్ హాల్ లోనే వుండిపోయారు. నిన్నటి నుంచి అక్కడే వున్న సీఎం, మంత్రులతో కనీసం ఎల్జీ చర్చించేందుకు కూడా ముందుకు రాకపోవడంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజ్ నివాస్ లోనే ఆమర నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష తనకు తానుగా చేయలేదని, ఢిల్లీ ప్రజల కోసం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని పేదల ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు తరలించడం ఇష్టంలేనట్లుగా వుందని అయన విమర్శించారు.
గత ఫిబ్రవరి 21 న ఆప్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో, సీఎం సమక్షంలోనే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఐఏఎస్ల నాలుగు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఒకవేళ, వీరిపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం కొత్త వివాదానికి దారితీసింది. దీంతో విధులకు హాజరుకాని అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు.
గవర్నర్ వైఖరికి నిరసనగా రాజ్ నివాస్ లోని సీఎం సహా మంత్రులు ధర్నాకు దిగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీకి రాష్ట్ర హోదాను కల్పిస్తే.. ఢిల్లీ ప్రజల ఓట్లన్నీ బీజేపి ఖాతాలోకే వెళ్లేందుకు తాను ప్రచారం చేస్తాననన్నారు. అయితే ఢిల్లీలో తమ పాలన సాగుకుండా ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, అవినీతి నిరోధక శాఖలను తమ మంత్రులపైకి ఉసిగొల్పుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇక ఇక్కడ బీజేపి, కేంద్రప్రభుత్వం వేషాలు చూస్తున్న దేశ ప్రజలు బీజేపి ఢిల్లీని వీడివెళ్లాలని కూడా అకాక్షిస్తున్నారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more