Vistara announces early monsoon flash sale ఇప్పుడిక విస్తార వంతు.. మాన్ సూన్ సీజన్ ఆఫర్..

Vistara cuts fares by up to 75 in 24 hour flash sale

monsoon sale, monsoon offers, goair offer, airasia offers, vistara offer, early monsoon sale, flight offers, monsoon offers

Three major airlines GoAir, AirAsia and Vistara have announced a sale on domestic flight tickets. The latest to join the bandwagon to offer low cost flight tickets is Vistara, which has announced a 24-hour flash sale offering up to 75% discount on all sectors

ఇప్పుడిక విస్తార వంతు.. మాన్ సూన్ సీజన్ ఆఫర్..

Posted: 06/06/2018 12:49 PM IST
Vistara cuts fares by up to 75 in 24 hour flash sale

విమానయాన సంస్థలు వరసపెట్టి మరీ చౌకధరల పోటీకి దిగుతున్నాయి. మధ్యతరగతి వారికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో దేశీయ విమానయాన రంగంలో ఈ సంస్థలు తీవ్ర పోటీని తెరతీశాయి. ఒక్క సంస్థ రాయితీ ప్రకటించిన క్రమంలో ఇక రాయితీల సీజన్ ప్రారంభమైనట్లే.. ఎందుకంటే అన్ని సంస్థలు ఈ రాయితీలను వరుసపెట్టి కస్లమర్లకు అందుబాటులోకి తీసుకోస్తున్నాయి. సీటు అక్యూపెన్సీతో పాటు.. నష్టాల నివారణకు ఈ విధానం తమకు కలసి వచ్చిందని విమానసంస్థలే ప్రకటించడంతో ఇక అన్ని సంస్థలు దీనిని పోటాపోటీగా తీసుకుంటున్నాయి.

అ క్రమంలో ఎయిర్ ఏషియా డిస్కౌంట్‌ ధరలను ప్రకటించిన పక్షం రోజలు వ్యవధిలోనే చౌక‌ధ‌ర‌ల విమాన‌యాన సంస్థ గో ఎయిర్‌ కూడా స్పెషల్‌ మాన్ సూన్‌ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఇక తానేం తక్కువా అన్నట్లు రంగంలోకి దిగింది విస్తార‌ ఎయిర్ లైన్స్‌. వర్షాకాలంలో మాన్ సూస్ సీజన్ ఆఫర్ గా తాజా రాయితీని అందుబాటులోకి తెచ్చింది. దేశీయ మార్గాల్లో విమాన టికెట్లపై 75 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. పరిమిత కాలం ఆఫర్ గా ఇది క్రితం రోజు అర్ధరాత్రి నుండి ఇవాళ అర్థరాత్రి అనగా జూన్ 6వ తేదీ అర్థరాత్రి వరకు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చిని సంస్థ వర్గాలు తెలిపింది. తన మొత్తంలో నెట్ వర్క్ లో ఈ సేల్‌ పథకంలో భాగంగా టికెట్‌ ధరలపై 75శాతం తగ్గింపును అందించనుంది.

ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా జూన్‌ 21నుంచి సెప్టెంబర్‌ 27 దాకా ప్రయాణానికి అనుమతి. ఢిల్లీ - లక్నో లాంటి చిన్నమార్గాల్లో రూ.1599 టికెట్‌ లభిస్తుండగా, ఢిల్లీ-హైదరాబాద్‌, ఢిల్లీ-రాంచీ మధ్య విమాన టికెట్లను రూ.2199కే ఆఫర్‌ చేస్తోంది. అలాగే ఢిల్లీ-కోలకతా, ఢిల్లీ-ముంబై టికెట్‌ ధర రూ.2,299 గా ఉండనుంది. కోలకతా- పోర్ట్ బ్లెయిర్ విమాన టిక్కెట్ల ధరలు 2,499 రూపాయలు, ఢిల్లీ-గోవా మధ్య రూ.2,799 ప్రారంభ ధరలుగా ఉంటాయని విస్తారా తెలిపింది. అన్ని చార్జీలను కలిపిన తరువాతే ఈ ధరలని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles