విమానయాన సంస్థలు వరసపెట్టి మరీ చౌకధరల పోటీకి దిగుతున్నాయి. మధ్యతరగతి వారికి కూడా విమానయానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో దేశీయ విమానయాన రంగంలో ఈ సంస్థలు తీవ్ర పోటీని తెరతీశాయి. ఒక్క సంస్థ రాయితీ ప్రకటించిన క్రమంలో ఇక రాయితీల సీజన్ ప్రారంభమైనట్లే.. ఎందుకంటే అన్ని సంస్థలు ఈ రాయితీలను వరుసపెట్టి కస్లమర్లకు అందుబాటులోకి తీసుకోస్తున్నాయి. సీటు అక్యూపెన్సీతో పాటు.. నష్టాల నివారణకు ఈ విధానం తమకు కలసి వచ్చిందని విమానసంస్థలే ప్రకటించడంతో ఇక అన్ని సంస్థలు దీనిని పోటాపోటీగా తీసుకుంటున్నాయి.
అ క్రమంలో ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ధరలను ప్రకటించిన పక్షం రోజలు వ్యవధిలోనే చౌకధరల విమానయాన సంస్థ గో ఎయిర్ కూడా స్పెషల్ మాన్ సూన్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ఇక తానేం తక్కువా అన్నట్లు రంగంలోకి దిగింది విస్తార ఎయిర్ లైన్స్. వర్షాకాలంలో మాన్ సూస్ సీజన్ ఆఫర్ గా తాజా రాయితీని అందుబాటులోకి తెచ్చింది. దేశీయ మార్గాల్లో విమాన టికెట్లపై 75 శాతం డిస్కౌంట్ ను అందిస్తోంది. పరిమిత కాలం ఆఫర్ గా ఇది క్రితం రోజు అర్ధరాత్రి నుండి ఇవాళ అర్థరాత్రి అనగా జూన్ 6వ తేదీ అర్థరాత్రి వరకు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చిని సంస్థ వర్గాలు తెలిపింది. తన మొత్తంలో నెట్ వర్క్ లో ఈ సేల్ పథకంలో భాగంగా టికెట్ ధరలపై 75శాతం తగ్గింపును అందించనుంది.
ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా జూన్ 21నుంచి సెప్టెంబర్ 27 దాకా ప్రయాణానికి అనుమతి. ఢిల్లీ - లక్నో లాంటి చిన్నమార్గాల్లో రూ.1599 టికెట్ లభిస్తుండగా, ఢిల్లీ-హైదరాబాద్, ఢిల్లీ-రాంచీ మధ్య విమాన టికెట్లను రూ.2199కే ఆఫర్ చేస్తోంది. అలాగే ఢిల్లీ-కోలకతా, ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.2,299 గా ఉండనుంది. కోలకతా- పోర్ట్ బ్లెయిర్ విమాన టిక్కెట్ల ధరలు 2,499 రూపాయలు, ఢిల్లీ-గోవా మధ్య రూ.2,799 ప్రారంభ ధరలుగా ఉంటాయని విస్తారా తెలిపింది. అన్ని చార్జీలను కలిపిన తరువాతే ఈ ధరలని ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more