అంతర్జాతీయ ఊహాజనిత కరెన్సీ బిట్ కాయిన్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా మరోమారు కష్టాల్లో చిక్కుకున్నారు. ఇ:డియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమానులైన రాజ్ కుంద్రా.. ఈజీ మనీ వేటలో బెట్టింగ్ కు పాల్పడి.. అడ్డంగా విచారణలో దొరికిపోయాడు. రెండేళ్ల నిషేధం తరువాత ఈ ఏడాదే మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ లో పునరాగమనం చేసింది. ఈ విధంగా కష్టాలు ఎదురైన క్రమంలో ఇకపై జీవితాన్ని సజావుగా, సక్రమంగా సాగేలా తమ వంతు చర్యలు తీసుకోవాల్సిన ఆయన మరోమారు అంతకన్న పెద్ద స్కాంలో చిక్కుకున్నారా.? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
బిట్ కాయిన్ స్కాంలో ఓ నిందితుడ్ని విచారిస్తున్న అధికారులకు ఈ స్కాంలో రాజ్ కుంద్రా కూడా వున్నాడన్న పేరు తెలియడంతో..ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. ఈ కేసులో రాజ్ కుంద్రాకు సంబంధముందని అమిత్ భరద్వాజ్ అనే నిందితుడు అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఆయన్ను ప్రశ్నించాలని నిర్ణయించుకున్న ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు చేరవేశారు. రాజ్ కుంద్రాతో పాటుగా రోజుకు రూపాయలు కోటి అపైన బిట్ కాయిన్ డీలింగ్ చేస్తున్న వారందరికీ అదాయ పన్ను శాఖ అధికారులు కూడా నోటీసులు పంపారు. వీరందరి పేర్లను కూడా ఐటీ అధికారులు ఈడీ అధికారులకు పంపారు.
అయితే రాజ్ కుంద్రాను ఈడీ అధికారులు స్కామ్ లో పాత్ర వుందని విచారించారా.? లేక ఆదాయ శాఖ అధికారులు పంపిన జాబితాలో పేరుందని విచారించారా.? అన్న విషయం మాత్రం స్పష్టం కాలేదు. ఓ భారీ నెట్ వర్క్ గా ఏర్పడి, కంప్యూటర్ ద్వరా గణిత శాస్త్ర సమీకరణాలతో బిట్ కాయిన్లను సృష్టిస్తారన్న సంగతి తెలిసిందే. దీనికి ఎటువంటి చట్టబద్ధతా లేనప్పటికీ, గత సంవత్సరంలో ఓ వెలుగు వెలిగిన బిట్ కాయిన్ విలువ, ఆపై కుదేలైన సంగతి తెలిసిందే. లక్సంబర్గ్ కేంద్రంగా నడుస్తున్న బిట్ స్టాంప్ ఎక్స్ఛేంజ్ ఈ లావాదేవీలను నిర్వహిస్తుండగా, భారత్ లో కొంతమంది చైన్ గా ఏర్పడి బిట్ కాయిన్ లావాదేవీలు ప్రారంభించి, ప్రజలను మోసం చేశారు. ఈ కేసులో పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకి వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more