వేతన సవరణ డిమాండ్ తో దేశ వ్యాప్తంగా మరోసారి బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఇవాళ ఉదయం తమ బ్యాంకుల వద్దకు చేరుకున్న ఉద్యోగులు.. బ్యాంకుల ఎదుటే సమ్మెకు దిగారు. రెండు రోజులపాటు సాగే ఈ సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో దాదాపు 10 లక్షల మందికిపైగా బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నారు. దీంతో బ్యాంకు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రెండు రోజులు ఆన్లైన్ లావాదేవీలు మినహా.. ఏటీఎంలు కూడా పనిచేయవని.. ప్రజలు తమను అర్థం చేసుకోవాలని ఉద్యోగసంఘాలు కోరుతున్నాయి.
అయితే అన్ లైన్ సేవలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేశాయి. సమ్మె నేపథ్యంలో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన కస్టమర్లకు మాత్రమే కష్టాలు వుంటాయని, ఆయా వర్గాలు తెలిపాయి. పాత ప్రైవేటు బ్యాంకులతో పాటు విదేశీ బ్యాంకులు కూడా తమ సమ్మెలో పాల్గోంటున్నాయని బ్యాంకింగ్ వర్కర్స్ నేషనల్ అర్గనైజేషన్ ఉపాధ్యక్షుడు అశ్వినీ రాణా తెలిపారు. కాగా ఈ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకు కస్టమర్లకు మాత్రం పెద్ద ఊరట లభించింది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా సహా పలు ప్రైవేటు బ్యాంకుల్లో సేవలు యధాతథంగా కొనసాగుతున్నాయి.
నోట్ల రద్దు జరిగిన నాటి నుంచి అప్పడప్పుడు మాత్రం ఏటీయంలు కరుణించగా, ఇక పూర్తి సమయం మాత్రం కస్టమర్లకు చక్కలు చూపాయి ఏటీయం కేంద్రాలు. ఇప్పటికే నోట్ల రద్దు నాటి పరిస్థితులను తలపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్న క్రమంలో బ్యాంకు సిబ్బంది సమ్మెలకు పూనుకోవడంపై మరిన్ని కష్టాలు తప్పేటట్లు లేవుని ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన సవరణపై చీఫ్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ, రేపు సమ్మెకు దిగక తప్పలేదని బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) తెలియజేసింది. అయితే జూన్ 1 నుండి బ్యాంకులు పనిచేయనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more