కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనకున్న ధీమా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తుడిచిపెట్టుకుపోవడంపై తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. అవేదన వ్యక్తం చేశారు. కర్నాటక రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి, సంక్షేమానికి తాను ఫలు విధాలుగా పాటుపడినా.. వారు తన సేవలను విస్మరించారని, కేవలం కుల, జాతుల ప్రాతిపదికన ఓట్లే వేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి కాంగ్రెస్ చేసిన కృషిని ఎవరూ పట్టించుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
బెంగళూరులోని పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో తన బాధనంతా వెళ్లగక్కారు. ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నా. ప్రజల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను విస్మరించి కులాలు, జాతుల అంశానికే ప్రాధాన్యమిస్తూ జనం మమ్మల్ని ఓడించారని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తమ ప్రణాళికను ప్రజలే మార్చేశారంటూ ఆయన బాధను వెళ్లగక్కారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాలను కాపాడాలంటే కాంగ్రెస్, దళ్ శాసనసభ్యులెవరూ బీజేపిలోకి వెళ్లవద్దని సిద్దరామయ్య పిలుపునిచ్చారు.
ఎన్నికలలో తమ అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా బీజేపి శ్రేణులు, కేంద్రమంత్రులు అందరూ నానా విధాలుగా తూలనాడిన అనంతరం.. వారితో ఎలా కలుస్తారని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ లేనప్పటికీ, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని... ఇదే అంశంపై తాము ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. బీజేపీ చేస్తున్న దారుణ రాజకీయాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. యెడ్యూరప్ప తన మెజారిటీ నిరూపించు కోవాలనుకుంటే... ముందు 112 మంది ఎమ్మెల్యేల పేర్లను వెల్లడించాలని సవాల్ విసిరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more