23 feared drowned as boat capsizes in Godavari గొదావరిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

23 missing after boat capsizes in godavari river in andhra pradesh

andhra pradesh boat capsize, andhra pradesh drowning, east godavari district, godavari river boat capsize, andhra pradesh boat mishap, Godavari River, Boat Capsizing, East Godavari, Andhra Pradesh, crime

Media reports suggest that the boat was carrying at least 40 people. It was en route to Vadapalli from Devipatnam when the tragedy happened in the Godavari river.

గోదావరిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

Posted: 05/16/2018 10:10 AM IST
23 missing after boat capsizes in godavari river in andhra pradesh

గోదావరి నదిలో పెళ్లి బృందంతో వెళ్తున్న లాంచీని ఎట్టకేలకు అధికారులు, పోలీసులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు.. పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య లాంచీ మునిగినట్లు సహాయక చర్యల్లో పాల్గోన్న రెస్కూ టీంలు గుర్తించాయి. అయితే... ఎన్టీఆర్‌ఎఫ్‌, పోలీస్‌ బృందాలు లాంచీని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నాయి. భారీ క్రేన్ల సాయంతో లాంచీని ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సహయాకచర్యలు కొనసాగుతున్నాయి. అలాగే గోదావరిలో గల్లంతైన వారి కోసం అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.

భారీ వర్షానికి తోడు తీవ్రమైన గాలులు వీయడంతో అదుపుతప్పి లాంచీ.. గోదావరిలో మునిగిపోవడంతో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా ప్రమాద సమయంలో మొత్తం లాంచీలో 38 మంది గిరిజనులు ఉన్నారని తెలుస్తుండగా అందులో ఏడుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు, కాగా ప్రతికూల వాతావరణం కారణంగా అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అయితే లాంచి మాత్రం 40 అడుగుల లొతున వున్నట్లు అధికారులు గుర్తించారు.

తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. సమీప గ్రామమైన మంటూరు సమీపానికి చేరడమే చాలా కష్టంగా ఉంది. ఆ మార్గం ఏ మాత్రం సహకరించడం లేదు. ఎట్టకేలకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌, ఎమ్మెల్యేలు ప్రమాద ప్రాంత సమీప గిరిజన గ్రామానికి చేరుకున్నారు. వర్షం కూడా ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు వాతావరణం సహకరించడం లేదు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన అధికారులు ప్రమాద ప్రాంతాలకు అటు, ఇటూ చేరుకుని సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఘటనాస్థలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి చిన్నరాజప్పలు చేరుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari River  Boat Capsizing  East Godavari  Andhra Pradesh  crime  

Other Articles