కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గోని రాష్ట్రం మొత్తం చుట్టి పరిస్థితును తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఇక అదే బాధ్యతను తన భుజాలపై మోసేందుకు రాష్ట్ర పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీలకు ఆరెస్సెస్ షాకిచ్చింది. అత్యంత గోప్యంగా జరిగిన తమ సర్వేలో అంతర్గతంగా ఇచ్చిన నివేదిక ప్రకారం బీజేపి ఎంత శ్రమించినా.. ఎన్ని సభలను ఏర్పాటు చేసినా.. ఈ సారి ఎన్నికలలో చుక్కెదురు కావడం ఖాయని తేల్చింది. ఈ నెల 12న జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి 70కి మించి ఒక్క సీటు కూడా రాదని ఆరెస్సెస్ నిర్వహించిన అంతర్గత సర్వేలో తేలింది.
ఈ సర్వే నివేదికను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దక్షిణ భారత ప్రాంతీయ ప్రముఖ్ వి.నాగరాజు బెంగళూరులో అందజేశారు. అయితే వారి నివేదిక ప్రకారం.. బీజేపీకి 70, కాంగ్రెస్ కు 115-120, జేడీఎస్ కు 29-34 సీట్లు వచ్చే అవకాశం ఉందని నివేదికలో ఉండడాన్ని చూసి నేతలు కంగుతిన్నారు. దళితులు, బలహీన వర్గాల వారిని బీజేపీ ఆకర్షించలేకపోయిందని నివేదికలో పేర్కొన్నారు. అలాగే, అడ్డగోలుగా అక్రమాస్థులను సంపాదించిన మైనింగ్ రారాజులుగా వెలుగొందుతున్న గాలి సోదరులకు పార్టీ టికెట్లు ఇవ్వడం.. ప్రధాని మోడీ, అమిత్ షాలు అవినీతి గురించి మాట్లాడటం కూడా వ్యతిరేకతకు దారి తీసాయిన పేర్కోంది.
ఇక అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలు, జీఎస్టీ, నిరుద్యోగ సమస్య.. తదితర అంశాలు బీజేపీ నుంచి ప్రజలను దూరం చేశాయని నివేదికలో పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికలపై మూడు నెలలుగా సర్వే నిర్వహిస్తున్న బీజేపీ దాని ప్రకారమే అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. అయినప్పటికీ తాజా నివేదిక నేతలకు మింగుడు పడడం లేదు. తాజాగా ఓ కన్నడ పత్రిక నిర్వహించిన సర్వేలోనూ బీజేపీ అధికారంలోకి రాదని తేలింది. ఈ కారణంగానే మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడను మచ్చిక చేసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more