కృష్ణా జిల్లాను ఎన్టీ రామారావు(ఎన్టీఆర్) జిల్లాగా మార్చుతామని వైసీపి అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. రామన్నపై వున్న అభిమానంతో ఆయన సొంతగ్రామం కృష్టా జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిమ్మకూరుకు చేరకున్న జగన్ ఈ మేరకు నందమూరి కుటుంబికుల మధ్య ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరును పెడతామని చెప్పారు. ఈ సందర్భంగా తమ గ్రామాభివృద్దికి సహకారం అందించాలని నందమూరి కుటుంబికులు జగన్ ను కోరగా, ఆయన గ్రామాభివృద్దితో పాటు ఈ మేరకు ప్రకటించారు.
ఈ సందర్బంగా ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరును మంత్రి నారా లోకేష్ దత్తత తీసుకున్నారని, అయినా ఇక్కడ నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షల అవినీతి జరుగుతుందని ఎన్టీఆర్ బంధువులు, గ్రామస్థులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. నీరు-చెట్టు పథకం కింద చెరువును 50 అడుగుల లోతు తవ్వుతున్నారని చెప్పారు. ఎనిమిదిన్నర లక్షల ఖర్చుతో చెరువును తవ్వుతూ.. తవ్విన మట్టి ఒక ట్రాక్టర్కు 350 రూపాయలు, లారీకి 600 రూపాయలకు అమ్ముకుని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొక్లెయిన్లతో మట్టి తవ్విన దృశ్యాలను వైఎస్ జగన్ చూపించారు.
నీరు చెట్టు పథకం పేరు చెప్పి 50 అడుగులు తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారని.. ఇక లేబర్ను పెట్టి తవ్వించామని చెప్పి కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి డబ్బును తీసుకుంటూ.. వీరు మాత్రం ప్రోక్లేయినర్లతో చెరువును తవ్వేస్తున్నారని గ్రామస్థులు జగన్ దృష్టికి తీసుకువచ్చిరు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సర్కారు అవినీతి ఎండగట్టారు. నిమ్మకూరుతో పాటు ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెడతామని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకూరును అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more