భారత్ అత్యాచారాల భారతంగా మారుతుందుని.. ప్రతీ 15 నిమిషాలకు ఓ అబల తన మానాన్ని కోల్పోతుందని ఎన్ని నివేదికలు వెల్లడిస్తున్నా.. నేరాల అదుపులో మాత్రం ప్రభుత్వాలు, పాలకులు కఠిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. నిర్భయ తరువాత అంతటి స్థాయిలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన ఉన్నావ్, కతువా అత్యాచార ఘటనలే. దేశవ్యాప్తంగా కామాంధులకు గుణపాఠంగా నిలిచేలా చట్టాలకు సవరణలు చేసి మార్పులు తీసుకువచ్చి.. అత్యాచారాలకు ఉరిశిక్షే విధించాలని చట్టాలను తెస్తున్నా.. పైశాచిక మృగాళ్లో మాత్రం మార్పు కానరావడం లేదు.
తాజాగా అసోంలో జరిగిన ఓ దారుణ అత్యాచార ఘటన కలకలంరేపుతోంది. తనకు ఇవ్వాల్సిన కట్నం కింద బంగారాన్ని సకాలంలో చెల్లించలేదని ఓ భర్త తన స్నేహితులతో కలిసి అతని భార్యపై అత్యాచారానికి ఒడిగట్టడం సంచలనంగా మారింది. కేవలం మూడు రోజుల క్రితమే పెళ్లైన అమె తన భర్త, అతని స్నేహితులు ఒడిగట్టిన దుర్మార్గపుదాష్టికానికి బిత్తరపోయి బంధువులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అస్సోంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అస్పోంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన వ్యక్తి స్థానికంగా ఓ యువతిని నచ్చి, మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో అతడికి డబ్బుతో పాటూ బంగారాన్ని కట్నంగా ఇస్తామని అత్తింటివాళ్లు ఒప్పుకున్నారు. అయితే మూడు రోజులుగా భార్యకు దూరంగా వుంటూవస్తున్న భర్త.. బంగారం విషయంలోనే భార్యపై కక్ష పెంచుకున్నాడు. మూడు రోజులవుతున్నా ఇంకా అత్తారింటి నుంచి రావాల్సిన బంగారం రాలేదని గత రాత్రి తన స్నేహితుల వద్ద ఏకరవు పెట్టాడు.
వారిచ్చిన సలహాతో కట్నమనే మత్తుతో కళ్లు మూసుకుపోయి.. పైశాచిక మృగంలా వ్యవహరించాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లిన అతను.. తన భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కేకలు బయటకు వినపడకుండా... నోట్లో గుడ్డలు కూడా కుక్కారు. ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న బాధితురాలు... బంధువులకు సమాచరం ఇచ్చింది. వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఆమెను వైద్య పరీక్షలు కోసం ఆస్పత్రికి తరలించారు. భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు... మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more