భారత్ అత్యాచారాల భారతంగా మారుతుందుని.. ప్రతీ 15 నిమిషాలకు ఓ అబల తన మానాన్ని కోల్పోతుందని ఎన్ని నివేదికలు వెల్లడిస్తున్నా.. నేరాల అదుపులో మాత్రం ప్రభుత్వాలు, పాలకులు కఠిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. నిర్భయ తరువాత అంతటి స్థాయిలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన ఉన్నావ్, కతువా అత్యాచార ఘటనలే. దేశవ్యాప్తంగా కామాంధులకు గుణపాఠంగా నిలిచేలా చట్టాలకు సవరణలు చేసి మార్పులు తీసుకువచ్చి.. అత్యాచారాలకు ఉరిశిక్షే విధించాలని చట్టాలను తెస్తున్నా.. పైశాచిక మృగాళ్లో మాత్రం మార్పు కానరావడం లేదు.
తాజాగా అసోంలో జరిగిన ఓ దారుణ అత్యాచార ఘటన కలకలంరేపుతోంది. తనకు ఇవ్వాల్సిన కట్నం కింద బంగారాన్ని సకాలంలో చెల్లించలేదని ఓ భర్త తన స్నేహితులతో కలిసి అతని భార్యపై అత్యాచారానికి ఒడిగట్టడం సంచలనంగా మారింది. కేవలం మూడు రోజుల క్రితమే పెళ్లైన అమె తన భర్త, అతని స్నేహితులు ఒడిగట్టిన దుర్మార్గపుదాష్టికానికి బిత్తరపోయి బంధువులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అస్సోంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అస్పోంలోని కరీంగంజ్ జిల్లాకు చెందిన వ్యక్తి స్థానికంగా ఓ యువతిని నచ్చి, మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో అతడికి డబ్బుతో పాటూ బంగారాన్ని కట్నంగా ఇస్తామని అత్తింటివాళ్లు ఒప్పుకున్నారు. అయితే మూడు రోజులుగా భార్యకు దూరంగా వుంటూవస్తున్న భర్త.. బంగారం విషయంలోనే భార్యపై కక్ష పెంచుకున్నాడు. మూడు రోజులవుతున్నా ఇంకా అత్తారింటి నుంచి రావాల్సిన బంగారం రాలేదని గత రాత్రి తన స్నేహితుల వద్ద ఏకరవు పెట్టాడు.
వారిచ్చిన సలహాతో కట్నమనే మత్తుతో కళ్లు మూసుకుపోయి.. పైశాచిక మృగంలా వ్యవహరించాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లిన అతను.. తన భార్యపై స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కేకలు బయటకు వినపడకుండా... నోట్లో గుడ్డలు కూడా కుక్కారు. ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న బాధితురాలు... బంధువులకు సమాచరం ఇచ్చింది. వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఆమెను వైద్య పరీక్షలు కోసం ఆస్పత్రికి తరలించారు. భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు... మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more