వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కోసమే తనకు మంత్రి పదవినిచ్చి తన క్యాబినెట్లో పెట్టుకున్నారా..? అని సందేహాలకు తెరతీసేట్లుగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వ్యవహరశైలి వుందన్న విమర్శలు ఎన్ని వచ్చినా.. వాటిని లక్ష్యపెట్టని పార్టీ, పాలక ప్రభుత్వం.. ఆయన చెబుతున్న దాంట్లో తప్పేముంది.? అన్ని ఓ వర్గంవారు ప్రశ్నించేట్లుగా చేస్తున్నాయి. అలాంటి మంత్రివర్యులు మరోమారు అత్యంత సున్నితమైన, యావత్ దేశం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్న కఠువా రేప్ కేసు ఘటనపై కూడా మరోసారి నోటికి పనిచెప్పారు.
ఈ హత్యాచారం ద్వారా హిందువులను అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ గేమ్ ప్లాన్లో భాగంగానే ఈ కేసుపై రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లోని కఠువా జిల్లాలో ఇటీవల కొందరు మానవ మృగాలు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడి, చంపేసి సమీప అడవుల్లో పడేశారు. ఈ దారుణంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు సైతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో నిన్న బీహార్లోని తన సొంత నియోజక వర్గమైన నవాడాలో కేంద్రమంత్రి గిరిరాజ్ మాట్లాడుతూ...
‘‘కఠువా కేసుతో హిందువుల ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు దేశాన్ని విడగొట్టేందుకు కుట్రపన్నారు. సెక్యులరిజం పేరట కొందరు హిందువులకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు...’’ అని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు స్వామి అసీమానందపై ‘‘హిందూ టెర్రర్’’ ముద్ర వేసేందుకు ప్రయత్నం చేశారనీ... ఇప్పుడు కఠువా కేసు పేరిట హిందువులను కించపర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా కఠువా సామూహిక అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాననీ... నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 05 | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కాస్తా రాష్ట్ర స్థాయికి చేరుకుంది. ఈ ఉద్యమంలో తాము కార్మికుల వైపే వున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ.. బంద్ కు మద్దతు తెలిపింది. అయితే ఇదే సంకేతాలను బలంగా... Read more
Mar 05 | హైదరాబాద్ నగరంతో పాటు అటు రాచకొండ, ఇటు సైబరాబాద్ కమీషనరేట్ ప్రాంతాల్లో రోజురోజుకీ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. మెట్రో రైలు వచ్చి ట్రాపిక్ సమస్యను కొంతవరకు తీర్చినా.. నానాటికీ పెరుగుతున్న కార్లు, ద్విచక్ర వాహనాల... Read more
Mar 05 | కర్ణాటకకు చెందిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో ఒకటి కర్ణాటకలో కలకలం రేపడంతో మంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహరం అంతటితో చల్లబడిందనుకునే తరుణంలో... Read more
Mar 05 | విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ (మార్చి 5న) రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్ కు అనుకూలంగానే... Read more
Mar 04 | మహిళలపై నేరాల విషయంలో గత ఏడాది అగ్రస్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఓ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి... Read more