వికారాబాద్ ప్రాంతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో విఘతజీవిలా పడివున్న బ్యూటీషియన్ జ్యోతి కేసులో అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. నిన్నటి వరకు పోలీసులు అమె మైలారం రైల్వే స్టేషన్ వద్ద కిందకు దిగేందుకు యత్నించి.. పడిపోయిందని చెప్పినా.. అమె అనుమానాస్పద మరణంలో మాత్రం అనేక సందేహాలు వెన్నాడుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్లో బ్యూటీషియన్ గా పనిచేస్తున్న జ్యోతి.. అమ్మమ్మ ఇంటికని బయలుదేరి మార్గమధ్యంలో శవమై కనిపించడం వెనుక కారణాలను అన్వేషిస్తున్న పోలీసులు చిక్కుముడిని విప్పే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
కేసు దర్యాప్తులో పోలీసులు మరికొన్ని విషయాలను తెలుసుకున్నారు. బ్యూటీషియన్ జ్యోతి.. సందీప్ అనే యువకుడితో గత మూడేళ్లుగా ప్రేమ వ్యవహరం నడుస్తుందని గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో జ్యోతి మృతిచెందిన ప్రాంతానికి వచ్చిన సందీప్ అప్పటినుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. అంతేగాక సందీప్ సెల్ఫోన్ స్విచ్చాఫ్ కూడా రావడంతో పోలీసులు అతనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతిని ప్రేమించిన సందీప్ ఎందుకు కనిపించకుండా పోయాడన్న విషయాన్ని పోలీసులు ట్రేస్ చేసే పనిలో వున్నారు.
ప్రేమించడం ఓకే కానీ పెళ్లి వరకు అది దారితీయడం ఇష్టం లేక.. తాండూరు వెళ్తున్న సమాచారంతో సందీప్ జ్యోతిని అంతమొందించాడా..? లేక ఇద్దరు కలసి వెళ్తుండగా, అనుకోని పరిస్థితుల్లో ఈ ప్రమాదం సంభవించిందా.? లేక జ్యోతికి వారింట్లో పెద్దలు మరో పెళ్లికి సిద్దం చేస్తున్నారా..? ఇది ఇష్టంలేక సందీప్ అమెపై పగతీర్చుకున్నాడా.? వంటి అనుమానాలు రెకెత్తుతున్నాయి. జ్యోతి ప్రేమికుడు సందీప్ అచూకీ లభ్యమయితే కానీ.. కేసు దర్యాప్తు కొలిక్కి చేరే అవకాశం లేదని తెలుస్తోంది.ఇదిలా ఉండగా వికారాబాద్ ఆస్పత్రిలో జ్యోతి మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతిచెందినట్లు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more