మద్యం మత్తు తలకెక్కితే.. మగాడైనా, అడవాళ్లైనా ఒక్కటే అన్న సత్యం మనకు తెలిసిందే. అయితే ఫుల్ గా మందు సేవించి.. కారులో రయ్ రయ్ అంటూ షికారు చేసేవారి అటలను హైదరాబాద్ సహా తెలంగాణలో పోలీసులు ఎక్కడిక్కడ కట్టడి చేస్తూనే వున్నారు. ఈ క్రమంలో క్రితంవారం శుక్రవారం రోజున ఓ యువతి పోలీసులతో వాదించి.. మీడియాపై రాళ్లు రువ్వి నానా హంగామా చేసింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలుకూ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
తన స్నేహితుడితో కలసి ఫుల్ గా మద్యం సేవించిన యువతి.. అతని కారులో వస్తుండగా జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ పోలీసులు స్థానిక చెక్ పోస్టు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పెట్టారు. దీంతో కారును నడుపుకుంటూ వచ్చిన యువతి స్నేహితుడు పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. దీంతో పక్కనే కూర్చున్న ఆమె, పోలీసులు అతడిని పట్టుకునేసరికి రెచ్చిపోయింది. పోలీసులతో వాగ్వాదానికి దిగి తన స్నేహితులను వదిలేయాలని డిమాండ్ చేసింది.
దీంతో మీడియా వాళ్లు మొత్తం రికార్డు చేశారు.. ఇప్పుడేమీ చేయలమని పోలీసులు చెప్పారో ఏమో తెలియదు కానీ.. పోలీసులతో వాదిస్తూ మీడియా వైపు చూసిన యువతి.. కిందనున్న రాళ్లను తీసుకుని మీడియాప్రతినిధులపైకి రువ్వింది. రాయడానికి వీలులేని విధంగా తిడుతున్న ఆమెను ట్రాఫిక్ పోలీసులు అదుపు చేయలేక శాంతి భద్రతల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై మహిళా పోలీసుల సాయంతో ఆమెను, ఆమె ఫ్రెండ్ నూ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఆ వీడియోను మీరూ చూడండి.
#WATCH Hyderabad: A woman created ruckus & pelted stones at media personnel after her friend was booked for drunken driving by traffic police in Jubliee Hills area last night. pic.twitter.com/K1AthMih70
— ANI (@ANI) April 8, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more