ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి యోగి అధిత్యనాత్ ఇంటి ఎదుట ఓ మహిళ తన కుటుంబంతో పాటు చేరుకుని.. తన పిర్యాదును ఎవరూ పట్టించుకోవడం లేదని అరోపిస్తూ.. సజీవ దహనానికి యత్నించింది. సీఎం ఇంటి వద్దనున్న పోలీసు భద్రతా సిబ్బంది హుటాహుటిన స్పందించడంతో అమెను కాపాడగలిగారు. తన కుటుంబంతో పాటు సీఎం ఇంటి వద్దకు చేరకున్న మహిళ అత్మహత్యకు పాల్పడేందుకు కారణాలు వింటే విస్తుపోవాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికారంలో వున్నవారు అన్నడమే తప్ప.. ఏడాదిగా బాధితురాలు తాను ఎదుర్కోన్న ఘటనపై పిర్యాదు చేస్తున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.
అందుకు కారణం.. చట్టసభకు ఎన్నికైన ఓ ఎమ్మెల్యే. అందులోనూ ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో వున్న బీజేపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడమే గమనార్హం. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సింగ్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించారు. ఏడాది క్రితం కుల్ దీప్ సింగ్, అతని సోదరుడితో కలసి తనపై అత్యాచారం చేశాడని, ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయింది. దీంతో స్వయంగా సీఎం యోగీ అధిత్యనాథ్ కు కూడా ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధితురాలు వాపోయింది.
ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, తనకు న్యాయం జరగడం లేదని, ఈ వ్యవహారంలో సంబంధమున్న అందరినీ శిక్షించకపోతే తాను చచ్చిపోతానంటూ బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. కాగా, ఈ కేసుపై లక్నో జోన్ అదనపు డీజీపీ రాజీవ్ కిషన్ మాట్లాడుతూ, ఈ వ్యవహారం ఇప్పటి వరకూ తేలకపోవడం వాస్తవమేనని అన్నారు. ఈ కేసును లక్నో న్యాయస్థానానికి అప్పగించారని, విచారణ జరిగితే గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేమని తెలిపారు. బాధితురాలి కుటుంబంపై దాడి జరిగిన విషయమై తమకు ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరిపిస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more