పార్లమెంటులో అత్యంత కీలకమైన అవిశ్వాస తీర్మాణాలను వరుసగా గత 13 రోజులుగా పలు పార్టీలు ప్రవేశపెట్టి.. సభ్యులను కూడగట్టుకుని చర్చకోసం పట్టుబడుతున్నా.. వాటిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే చివరి రోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను వాయిదా వేశారు. మార్చి 5న ప్రారంభమైన మలివిడత సమావేశాల్లో పట్టుమని వారం రోజులు కూడా సభ సజావుగా సాగలేదు. తొలుత రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ విపక్ష పార్టీ వైసీపీ అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టగా, మరుసటి రోజున టీడీపీ ఆ తరువాత ప్రధాన ప్రతిపక్షం బ్యాంకుల స్కాములు, సీబీఎస్ఈ పేపర్ లీక్, ఎస్సీ, ఎస్టీ అంశాలు సహా పలు అంశాలపై అవిశ్వాస తీర్మాణాలను ప్రవేశపెట్టినా.. చివరి రోజున వీటిపై స్పీకర్ సభలో ఎలా వ్యవహరిస్తారోనని యావత్ దేశం ఉత్కంఠతో ఎదురుచూడగా, షరామామూలుగానే బడ్జెట్ సమావేశాలు కూడా విపక్ష సభ్యుల నిరసనల మధ్య ముగిసాయి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజున కూడా అన్నాడీఎంకే ఎంపీలు కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేపట్టడంతో పాటు.. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సమావేశాల చివరిరోజు కావడంతో సభ్యులు సయంమనంతో ఉండి సభా నిర్వహణకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహాదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు కూడా కూడా అందోళన చేపట్టారు. దీంతో సభలో గంధరగోళం ఏర్పడింది. కాగా, స్పీకర్ సభ కార్యక్రమాలు జరిగిన వివరాలను సభ్యులకు తెలియజేశారు. అనంతరం జాతీయ గీతాన్ని అలపించిన తరువాత సభ్యలో మరోమారు గంధరగోళ వాతావరణం ఏర్పడటంతో స్పీకర్ బడ్జెట్ సమావేశాలు ముగిసాయని ప్రకటించారు.
వైసీపీ ఎంపీల రాజీనామా..
తమ అధినేత వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే ఆ పార్టీ లోక్ సభ సభ్యులు పార్లమెంటు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో, ప్రత్యేక హోదాపై ఎలాంటి ప్రకటన చేయకుండగానే సభా కార్యక్రమాలను ముగించడానికి నిరసనగా, తమ పదవులకు రాజీనామాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఆమె ఛాంబర్ లో కలసి తమ రాజీనామాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని సూచించారు. దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం వారు అక్కడ నుంచి ఏపీ భవన్ కు బయల్దేరారు. స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణదీక్షను వారు చేపట్టనున్నారు.
స్పీకర్ ఛాంబర్ లో టీడీపీ ఎంపీలు.. ఇలా బురిడీ కొట్టిస్తారా.. ?
టీడీపీ ఎంపీలను లోక్సభ స్పీకర్ కార్యాలయం తప్పుదారి పట్టించింది. లోక్సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే టీడీపీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగారు. ప్రధాని కూర్చునే కుర్చీ ముందు భైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో స్పీకర్ పిలుస్తున్నారని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో ఎంపీలు సభ నుంచి బయటకు వచ్చారు. ఎంపీలు బయటకు రాగానే వెంటనే సిబ్బంది లోక్సభ తలుపులను మూసివేశారు. మరోవైపు టీడీపీ ఎంపీలు రాకముందే స్పీకర్ సుమిత్రీమహాజన్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. స్పీకర్ కార్యాలయ సిబ్బంది తీరుకు నిరసనగా లోక్సభ స్పీకర్ ఆఫీసు ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more