తన సోదరి, ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యతో తీవ్ర దిగ్భ్రాంతిని గురైన సినీ నటుడు ప్రకాశ్ రాజ్.. అమె నడిచిన బాటలోనే పయనిస్తూ.. బీజేపి పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఆమె హత్య నేపథ్యంలో ప్రధాని మౌనాన్ని వీడాలని డిమాండ్ చేసిన విలక్షణ నటుడు.. అప్పటి నుంచి బీజేపిని టార్గెట్ చేస్తూ జస్ట్ అస్కింగ్ #just asking పేరుతో బీజేపిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనుషుల కన్నా గోవులకే అధిక ప్రాధాన్యత ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు. గోవు, కొబ్బరికాయలు ఎప్పుడు హిందూ మతాన్ని పుచ్చుకున్నాయని ఆయన ప్రశ్నించారు.
మనిషి మనిషిగా చూడలేని మతచాంధాసవాదులు.. మనుషలను కొట్టి, అవసరమైతే చంపీ కూడా గోవులకు ప్రాధాన్యతను కల్పిస్తున్నారని విమర్శించారు. తాను వెళ్లిన ప్రతి చోట కొందరు మతఛాందసవాదులు ఆవు పేడతో కళ్లాపి చల్లి, గోమూత్రంతో శుద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఖర్జూరం, గొర్రె ముస్లిం మతంలో ఎప్పుడు చేర్చారని నిలదీశారు. ఇదే క్రమంలో పసుపు, కాషాయ వర్ణాలకు జాతి లేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కానని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదంటూనే.. అణగారిన వర్గప్రజలకు ఎప్పడూ అండగా ఉంటానని తన సోదిర బాటలోనే పయనిస్తానని తేల్చి చెప్పారు.
మనిషి కన్నా గోవే ముఖ్యమని కొందరు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేసిన ప్రకాశ్ రాజ్ పనిలో పనిగా మీడియాకు కూడా చురకలంటిస్తూ.. పాత్రికేయులు ప్రశ్నించే తత్వాన్ని మర్చిపోతున్నారని, ఇది సమాజానికి సహేతుకం కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కొందరు.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులను శునకాలతో పోలుస్తున్నారని, మనిషిని మనిషిగా చూడలేని వ్యవస్థలో నాయకులుగా చెలామణి అవుతున్న నేతలు సిగ్గుపడాలని అయన దుయ్యబట్టారు. తప్పుడు మాటలు, తప్పుడు సందేశాలు ఇచ్చే బీజేపీ నేతలను ప్రశ్నించేందుకు 2500 మందితో ఓ బృందాన్ని తయారు చేసినట్టు ప్రకాశ్ రాజ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more