ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతూ బిజీగా గడుపుతున్నారు. ఉదయం పార్లమెంటుకు చేరుకున్న ఆయన ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నమస్కరించి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంటు ద్వారానికి నమస్కరించి లోనికి వెళ్లారు. ముందుగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలతో కలిసి చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్లమెంటు ప్రధాన ద్వారం ముందు ఉన్న మెట్లకు నమస్కరించారు. పార్లమెంటులోనికి ప్రవేశిస్తూ.. ఇది ప్రజాస్వామ్య దేవాలయం అంటూ లోపలకి అడుగుపెట్టారు. పార్లమెంటు లోపలికి వచ్చిన చంద్రబాబు నేరుగా టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు.
అనంతరం పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. వివిధ పార్టీల నేతలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, వేణుగోపాల్, ఎన్సీపీ నేతలు సుప్రీయా సూలే లతో భేటీ అయ్యారు. ఆ తరువాత జమ్మూకాశ్మీర్ విపక్ష నేత ఫరూక్ అబ్దుల్లా తో పాటు కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, వీరప్ప మొయిలీ, రాజీవ్ సాతీవ్, టీఆర్ఎస్ ఎంపీ జీతేందర్ రెడ్డితో పాటు తారిక్ అన్వర్, అనుప్రియ పటేల్, హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తదితరులతో సమావేశమై చర్చించారు. విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు.
విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేకహోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ తమకు బాసటగా నిలవాలని వారికి విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ తో మాట్లాడుతూ మనమంతా దక్షిణభారతీయులమని, ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దుతు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన వేణుగోపాల్ తన పార్టీ అధిష్టానంతో భేటీ అయి తరువాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more