దేశంలోనే సుదీర్ఘచరిత్రగల రాజకీయ పార్టీ గత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జరిగిన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం తెలంగాణ ఇచ్చినా.. అధికారంలోకి మాత్రం రాలేకపోయింది. అయితే ఈ సారి మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్.. ఎన్నికల సమరశంఖం పూరించడానికి ఇంకా చాలా సమయం వున్నప్పటికీ.. అప్పుడే తమ హామీలతో రాష్ట్ర రైతంగానికి గాలం వేస్తుంది. రైతులను తమ వైపుకు తిప్పుకుంటే తప్ప.. అధికారం తమకు అందదని భావిస్తున్న హస్తం నేతలు.. అప్పుడే వారిని అకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలను అప్పుడే రచించేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రైతలను అకర్షించేందుకు చేసిన ప్రకటన రైతులను కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా చేస్తుంది. ప్రస్తుతం అధికారంలో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ నుంచి రైతులకు ఎకరానికి రూ.8 వేల రూపాయలను ఏఢాదికి అందిస్తూ.. దానిని పలు విడతలుగా అందిస్తామని ప్రకటించి.. అది కేవలం పంటలు వేసేందుకు విత్తనాలు, ఎరువుల కోసం అందిస్తున్నట్లు ప్రకటించగా, కాంగ్రెస్ ఏకంగా రుణమాఫీని అందుకుంది. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫి చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డీ ఈ ప్రకటన చేయడంతో రైతాంగం అకర్షితులవుతుంది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో మహిళా సంఘాలకు అనేక పథకాల ద్వారా రుణాలు వచ్చాయని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తుందని, నిరుద్యోగ భృతి కింద ఆర్థిక సాయం కూడా ఇస్తుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో విఫలమైందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more