సీబీఎస్ఈ పరీక్ష పేపర్ల లీకేజీ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే లేపుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టాయి. పంచకుల సీబీఎస్ఈ కార్యాలయం నుంచి అటు పంజాబ్, హర్యానా ఇలా రాష్ట్రాలవారిగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలసి అందోళనకు దిగారు. మళ్లీ పరీక్షలు రాయాలంటూ సీబీఎస్ఈ నుంచి సంకేతాలు వస్తున్న క్రమంలో తాము పరీక్షలను రాయబోమని తెగేసి చెబుతున్నారు. పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ బాధ్యతను సీబీఎస్ఈ అధికారులు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు విద్యార్థులందరికీ మరోమారు పరీక్షలు నిర్వహించి వారికి శిక్ష్ వేస్తారా అని ప్రశ్నిస్తున్నాయి.
ఇక సరిగ్గా దేశంలో లీకుల ప్రహసనం కొనసాగుతన్న క్రమంలోనే ఈ సీబీఎస్ఈ పేపర్లు కూడా లీక్ కావడంతో ఇటు రాజకీయంగాను కేంద్రంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఢిల్లీలోని సీబీఎస్ఈ కార్యలయం వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వచ్చి అందోళన కార్యక్రమాలను చేయడంతో.. అప్రమత్తమై కేంద్రప్రభుత్వం.. సంబంధిత కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇంటి వద్ద భద్రత పెంచారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అటుగా రానీయకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్ద 144 సెక్షన్ విధించారు.
సీబీఎస్ఈ నిర్వహించే రీఎగ్జామ్ ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే పిలుపునిచ్చారు. ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ తప్పును ఒప్పుకోకుండా... రీఎగ్జామ్ పేరుతో విద్యార్థులను మరిన్ని కష్టాలకు గురి చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రశ్నాపత్రాలను కాపాడలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తాము చేసిన తప్పుకు విద్యార్థులు ఎందుకు శిక్షను అనుభవించాలని ప్రశ్నించారు. రీఎగ్జామ్ రాయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరాదని... ఇప్పుడు తల వంచితే... భవిష్యత్తులో మరెన్నో సార్లు ఇలాగే తల వంచాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. మంత్రి వైఫల్యం వల్లనే ఈ అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించింది. పేపర్ లీక్ వల్ల 28 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్జే అన్నారు. ఇధి చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ అంశాన్ని తాము పార్లమెంటులో లేవనెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తక్షణ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్పై పలువురు విద్యార్థులు, యువజన కాంగ్రెస్ నేతలు ఢిల్లోలో పలుచోట్ల శుక్రవారంనాడు నిరసనలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more