దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాం‘కింగ్’ సంస్థగా అవతరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్బీఐ నుంచి గృహ రుణాలు తీసుకోవాలనుకునే ఖాతాదారులకు రేపటి వరకు తమకు ధరఖాస్తు చేసుకన్న తరుణంలో వారికి బంఫర్ అఫర్ ప్రకటించింది. అంటే ఇది పూర్తిగా వన్డే బంఫర్ ఆఫర్ అన్నమాట. అదెలా అంటే.. మార్చి 31 (రేపటి) వరకు గృహ రుణాల కోసం ఎస్బీఐ వారికి దరఖాస్తు చేసుకన్న వారికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే రుణాలను మంజూరు చేయనుంది. అంటే రేపుటిలోగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రాసెసింగ్ ఫీజును ఎస్బీఐ రద్దు చేసింది. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
‘ఎస్బీఐ గృహ రుణాలపై మార్చి 31 వరకు ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేశాం. అంతేగాక.. ఆకర్షణీయమైన వడ్డీరేట్లు కూడా ఉన్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని కోల్పోవద్దు’ అని ట్విటర్లో పేర్కొంది. ఎస్బీఐలో రూ. 30లక్షల వరకు గృహ రుణాలు తీసుకునే వేతన జీవులకు రూ. 8.4శాతం వడ్డీరేటు పడుతుంది. ఇదే ఉద్యోగం చేసే మహిళలకైతే 8.35శాతం మాత్రమే. ఇక వేతన జీవులు కాకపోతే మహిళలకు 8.45శాతం, పురుషులకు 8.5శాతం వడ్డీరేటు ఉంటుంది. కాగా.. మార్చి 31 ఈ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది ఎస్బీఐ.
ఇక రూ.30 లక్షల నుంచి రూ. 75 లక్షల లోపు రుణాలు తీసుకునే వారికి మరో విధంగా వడ్డీ రేట్లు వున్నాయి. వేతన జీవులకు 8.55 నుంచి 8.6 వరకు వడ్డీ పడుతుండగా, మహిళా ఉద్యోగులకైతే 8.5 నుంచి 8.55 వరకు పడనుంది. అదే వేతన జీవులు కాని పక్షంలో 8.7 నుంచి 8.75 వరకు అదే మహిళా వ్యాపారులైతే.. 8.65 నుంచి 8.7 వరకు వార్షిక వడ్డీ పడుతుందని ఇక అంతకు మించిన మొత్తాన్ని రుణాలుగా పొందేవారికి వ్డడీరేట్లు వేరుగా వున్నాయని తెలిపింది. మరోవైపు ఎస్బీఐలో విలీనమైన ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల పాస్ బుక్ లు, చెక్ లు కూడా రేపటి వరకే పనిచేస్తాయని ఎస్బీఐ మరోసారి స్పష్టంచేసింది. కొత్త చెక్ బుక్ ల కోసం రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more