కోట్లకు పడగలెత్తిన పారిశ్రామిక వేత్తల బకాయిలను ఒక్క కలంపోటుతో రైట్ ఆఫ్ చేసే బ్యాంకులు.. సామాన్యులకు సంబంధించిన సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే మాత్రం చార్జీలపై చార్జీలను వేసి మరీ వసూలు చేస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ.. సామాన్యుల సేవింగ్స్ అకౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేయాలని కూడా వినతులు వెళ్లాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన భారతీయ స్టేట్ బ్యాంకు.. ఖాతాదారుల కోరికను పూర్తిగా అమలు చేయలేదు.
అయితే మినిమమ్ బ్యాలెన్స్ లేని పక్షంలో విధించే చార్జీలను మాత్రం సుమారుగా 70శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 25 కోట్ల మంది ఎస్బీఐ ఖాతాదారులకు ఊరటకలగనుంది. సేవింగ్ ఖాతాల్లో ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ లేని కస్టమర్లకు విధించే పెనాల్టీ చార్జీలను తగ్గించింది. సవరించిన చార్జీలు వచ్చేనెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇప్పటి వరకు నెలకు యాభై రూపాయల చొప్పున విధించబడే పెనాల్టీ ఇకపై రూ.15కు పరిమితం కానుంది.
సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.40 వరకు నాన్ మెయింటెనెన్స్ చార్జీలు విధిస్తున్నారు. ఎస్బీఐ తాజా నిర్ణయంతో రానున్న అర్థిక సంవత్సరం నుంచి సెమీ అర్బన్ కస్టమర్లకు విధించే పెనాల్టీ చార్జి రూ.12, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వరకు చార్జీలు విధించనున్నారు. అయితే ఈ చార్జీలకు యధావిధిగా జీఎస్టీ అదనంగా ఉంటుంది. అటు పారిశ్రామిక వేత్తల రుణాల రైట్ ఆఫ్ తో పాటు ఇటు బ్యాంకు లాభార్జనలో అదాయం కన్నా పెనాల్టీలతో ల ద్వారా వచ్చే ఆదాయం అధికంగా ఉండటం కూడా విమర్శలకు దారితీసింది. దీంతో ఈ మేరకు దిద్దుబాట్టు చర్యలకు బ్యాంకు యాజమాన్యం దిగింది.
విద్యార్థులు, నిరుపేదలకు చెందిన ఖాతాలను సైతం రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలుగా పరిగణించడంతో భారీగా నష్టపోతున్నరని గ్రహించిన బ్యాంకు ఇకపై సామన్యుల తమ ఖాతాలను రెగ్యూలర్ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎలాంటి చార్జీలు పడని బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఢిపాజిట్ అకౌంట్ కు మార్చుకునే వెసలుబాటు కూడా కల్పించింది. ఎస్బీఐకి మొత్తం 41 కోట్ల సేవింగ్స్ ఖాతాలుండగా.. అందులో 16 కోట్ల వరకు జన్థన్ ఖాతాలు, బేసిక్ ఖాతాలే ఉన్నాయి. ఈ ఖాతాలకు కనీస నిల్వల నిబంధన లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more