Eight CRPF personnel killed in Sukma district సుకుమా జిల్లాలో మావోల ఘాతుకం: 8మంది జవాన్ల మృతి

8 crpf jawans killed in blast by maoists in chhattisgarh s sukma

Chhattisgarh Maoists, Maoist blast, Maoists, mine-protected vehicle (MPV), blast, Sukma district, Chhattisgarh forest, CRPF personnel killed, CRPF jawans

Eight personnel of the Central Reserve Police Force (CRPF) were killed when suspected Maoists blew up their mine-protected vehicle (MPV) in Chhattisgarh’s Sukma district on Tuesday, an official said.

సుకుమా జిల్లాలో మావోల ఘాతుకం: 8మంది జవాన్ల మృతి

Posted: 03/13/2018 02:40 PM IST
8 crpf jawans killed in blast by maoists in chhattisgarh s sukma

ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలో మరోమారు మావోయిస్టులు పేట్రోగిపోయారు. తెలంగాణ-చత్తీస్ గడ్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ సమాచారం అందుకున్న మావోయిస్టులు భారిస్థాయిలో విస్పోటక పద్యార్థాలను పేల్చడంతో.. కూంబింగ్ చేస్తున్న ఎనమిది మంది జవాన్లు ఘటనాస్థంలోనే విఘతజీవులుగా మారారు. మరో అరుగురు జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో.. రాయ్ పూర్ ప్రాంతానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని గొల్లపల్లి-కిష్టారం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ అస్పత్రులకు తరలించారు పోలీసులు.

కూంబింగ్ చేస్తున్న పోలీసుల అందరూ 212 బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ పోలీసులే. కాగా, రంగంలోకి దిగిన పోలీసు బలగాలు కిష్టారం ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. కూంబింగ్‌ నిర్వహిస్తోన్న‌ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై కాల్పుల‌కు తెగ‌బ‌డి 8 మంది జవాన్ల ప్రాణాలు తీశారు. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు జవాన్ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. కాగా మరణించిన జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఆసుప‌త్రికి తరలిస్తున్నారు. పోలీసులు కూంబింగ్ చేస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న మావోలు.. మైన్ రక్షిత వెహికిల్ ను అదే సమయంలో పేల్చాడంతో దారుణం జరిగింది.

 అయితే సదరు వాహనమేంటా అని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులు.. దానిని చూస్తున్న క్రమంలో అకస్మాత్తుగా వాహనం పేలిపోయింది. అయితే సాధారణం కన్నా అధికస్థాయిలో విస్పోటక పధార్థాలను ప్రయోగించడంతో జవాన్లు మృతిచెందారని అధికారులు అంచనావేస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతమైన తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో పోలీసులకు మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్తులు మరణించారు. అయితే అందుకు ప్రతీకార చర్యగానే మావోలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles