ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరోమారు మావోయిస్టులు పేట్రోగిపోయారు. తెలంగాణ-చత్తీస్ గడ్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ సమాచారం అందుకున్న మావోయిస్టులు భారిస్థాయిలో విస్పోటక పద్యార్థాలను పేల్చడంతో.. కూంబింగ్ చేస్తున్న ఎనమిది మంది జవాన్లు ఘటనాస్థంలోనే విఘతజీవులుగా మారారు. మరో అరుగురు జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో.. రాయ్ పూర్ ప్రాంతానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని గొల్లపల్లి-కిష్టారం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ అస్పత్రులకు తరలించారు పోలీసులు.
కూంబింగ్ చేస్తున్న పోలీసుల అందరూ 212 బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ పోలీసులే. కాగా, రంగంలోకి దిగిన పోలీసు బలగాలు కిష్టారం ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. కూంబింగ్ నిర్వహిస్తోన్న సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడి 8 మంది జవాన్ల ప్రాణాలు తీశారు. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. కాగా మరణించిన జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తున్నారు. పోలీసులు కూంబింగ్ చేస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న మావోలు.. మైన్ రక్షిత వెహికిల్ ను అదే సమయంలో పేల్చాడంతో దారుణం జరిగింది.
అయితే సదరు వాహనమేంటా అని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులు.. దానిని చూస్తున్న క్రమంలో అకస్మాత్తుగా వాహనం పేలిపోయింది. అయితే సాధారణం కన్నా అధికస్థాయిలో విస్పోటక పధార్థాలను ప్రయోగించడంతో జవాన్లు మృతిచెందారని అధికారులు అంచనావేస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతమైన తడపలగుట్ట, ఛత్తీస్గఢ్లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో పోలీసులకు మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్తులు మరణించారు. అయితే అందుకు ప్రతీకార చర్యగానే మావోలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more