ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్లు బరితెగించి, ప్రయాణికులపై బెదిరింపులకు పాల్పడ్డారు. వారిని ఏకంగా బ్లాక్ మెయిల్ చేశారు. ఎంతలా అంటే తమకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే విమానాలను పేల్చేస్తామని హెచ్చరించారు. ఇంతగా ప్రయాణికులను బెదిరించాల్సిన అవసరం ఫైలెట్లకు ఎందుకు వచ్చింది.? అంటే వారు నిర్ణీత సమయానికి కాకుండా ఏకంగా రెండు గంటలు ఆలస్యంగా విమానాశ్రయంలోని విమానం వద్దకు చేరుకోవడమే. అయితే ఏంటని అంటారా..? అలస్యంగా వచ్చిన తమ రాకను ప్రయాణికులు వీడియోలు తీయడం గమనించిన పైలెట్లు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. విమానం పేల్చేస్తామని బెదిరించినట్టు కొందరు ప్రయాణికులు ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గోఎయిర్ సంస్థకు చెందిన జీ8 113 విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ సమయం ప్రకారం ఉదయం 5.50కి బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులంతా గంట ముందుగానే చెక్ ఇన్ అయ్యారు. ఇక ప్రయాణికులందరూ ఉదయం 5.10 నిమిషాలకు విమానం వద్దకు చేరకున్నారు. అయినా అక్కడ వారికి పైలెట్ల జాడ కనిపించలేదు. దీంతో చిరెత్తుకోచ్చిన ప్రయాణికులు అప్పటికే అక్కడి సిబ్బందిపై అలస్యానికి గల కారణాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమయం ఏడు గంటలు కావస్తున్నా.. విమానం కదులుతుందో లేదో కూడా తెలియని ప్రయాణికులు ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో కేకలు వేయడం మొదలుపెట్టారు.
ఇక నింపాదిగా రెండు గంటల ఆలస్యంగా సుమారు 7:30 సమయంలో పైలట్లు విమానం వద్దకు చేరుకోవడాన్ని ప్రయాణికులు గమనించారు. దీంతో అప్పటికే అగ్రహంతో రగలిపోతున్న ప్రయాణికులు వారి రాకను తమ సెల్ ఫోన్లలో బంధించారు. దీనిని గమనించిన పైలెట్లు వాటిని తీయకూడదని వారించారు. అయితే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని ప్రయాణికులు కూడా ఖరాఖండీగా చెప్పారు. దీంతో పైలెట్లు ఏదో సణుగుకుంటూ విమానంలోకి ఎక్కడం విన్న ఓ ప్రయాణికుడు.. తన సహచర ప్రయాణికులతో ఏదో విషయం చెప్పాడు. అంతే ఇక ఆ పైలెట్లు తమకు వద్దని ప్రయాణికులు పట్టుబట్టారు. అయితే పైలెట్లను మార్చడానినిక యాజమాన్యం ససెమిరా అనడంతో.. ముగ్గురు ప్రయాణికులు విమానం దిగి వెళ్లిపోయారు.
అసలు ఆ ప్రయాణికుడు ఏం చెప్పాడంటే.. తమ అలస్యాన్ని తమ సెల్ ఫోన్లలో వీడియోలుగా బంధించిన దృష్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే తాను మార్గమథ్యంలో విమానాన్ని పేల్చేస్తానని అన్నాడని అరోపించడంతో విమానంలో కలకలం రేగింది. దీంతో ఆ పైలెట్లు తమకు వద్దనీ.. వెంటనే వారిని మార్చేయాలంటూ ప్రయాణికులు పట్టుబట్టారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో పైలెట్లు మాత్రం.. యాజమాన్య సమస్యల వల్లే తాము ఆలస్యంగా రావాల్సి వచ్చిందని.. తమను అపార్థం చేసుకోవద్దని వివరించారు. ఇక ఈ గందరగోళం మధ్య ఎట్టకేలకు ఉదయం 8:40 బయల్దేరిన విమానం చివరకు బెంగళూరుకు 11.20 కు చేరకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more