హైదరాబాద్ లో విద్యార్థిని హనీషా చౌదరి(24) ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. శివశివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ హనీషా చౌదరి ఎంబీఏ చదువుతోంది. గుజరాత్ కు చెందిన దక్షిత్ పటేల్ మేడ్చల్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.
అది కాస్త ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకోవాలని హనీషా ఒత్తిడి చేయటం ప్రారంభించింది. అయితే దక్షిత్ మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వారిద్దరూ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. 10గంటల నుంచి అర్ధరాత్రి 1.30ని. వరకు వారి సంభాషణ కొనసాగింది. ఇంతలో తన ఫ్రెండ్ వివాహానికి వెళ్తునట్లు హనీషా చెప్పగా.. అందుకు దక్షిత్ నిరాకరించాడు. దీంతో తనను అవమానిస్తున్నావంటూ ఆగ్రహానికి లోనైన హనీషా వాగ్వాదానికి దిగింది. చివరకు అది ముదరటంతో ‘నేను చనిపోతున్నానంటూ’ అతని కళ్ల ముందే ఉరేసుకుంది.
కంగారుపడిన దక్షిత్ కోంపల్లిలో ఆమె ఉంటున్న హాస్టల్ కు వచ్చాడు. కానీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రియుడు దక్షిత్ పటేల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆమె మొబైల్ ఫోరెన్సిక్ విభాగానికి పంపి మరిన్ని మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, హనీషా తండ్రి అనంతపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత బుగ్గయ్య చౌదరి. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తరువాత, అనంతపురానికి తరలించగా, ఆమె స్నేహితులు, బంధువులు నివాళులు అర్పించారు. కుమార్తె మృతదేహం వద్ద బుగ్గయ్య గుండెలవిసేలా విలపించారు. ఏపీ మంత్రి పరిటాల సునీత.. హనీషా మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి బుగ్గయ్య కుటుంబాన్ని ఓదార్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more