Police Reveals Details of Haneesha Suicide Case | దక్షిత్ వద్దన్నాడు.. హనీషా ఉరే చేసుకుంది

Haneesha chowdary suicide case

Haneesha Chowdary, Dakshit Patel, Video Call Suicide, Hyderabad MBA Student, Haneesha Chowdary Suicide, Haneesha Chowdary Case, Haneesha Chowdary Suicde Case, MBA Student Haneesha Chowdary, Haneesha Chowdary Father, Haneesha Chowdary Case Facts, Haneesha Chowdary Details

Hyderabad MBA Student Haneesha Chowdary's Suicide Case. Police Reveals actual facts in Case. Haneesha was apparently angry as her boyfriend Dakshit Patel had objected to her attending a wedding, police said."An argument broke out between the two after which she seems to have told him that she was going to end her life," the officer said.

హనీషా అందుకే సూసైడ్ చేసుకుందా?

Posted: 02/19/2018 03:36 PM IST
Haneesha chowdary suicide case

హైదరాబాద్ లో విద్యార్థిని హనీషా చౌదరి(24) ఆత్మహత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆమె సూసైడ్ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. శివశివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ హనీషా చౌదరి ఎంబీఏ చదువుతోంది. గుజరాత్ కు చెందిన దక్షిత్ పటేల్ మేడ్చల్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.

అది కాస్త ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకోవాలని హనీషా ఒత్తిడి చేయటం ప్రారంభించింది. అయితే దక్షిత్ మాత్రం వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వారిద్దరూ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు. 10గంటల నుంచి అర్ధరాత్రి 1.30ని. వరకు వారి సంభాషణ కొనసాగింది. ఇంతలో తన ఫ్రెండ్ వివాహానికి వెళ్తునట్లు హనీషా చెప్పగా.. అందుకు దక్షిత్ నిరాకరించాడు. దీంతో తనను అవమానిస్తున్నావంటూ ఆగ్రహానికి లోనైన హనీషా వాగ్వాదానికి దిగింది. చివరకు అది ముదరటంతో ‘నేను చనిపోతున్నానంటూ’ అతని కళ్ల ముందే ఉరేసుకుంది.

కంగారుపడిన దక్షిత్ కోంపల్లిలో ఆమె ఉంటున్న హాస్టల్ కు వచ్చాడు. కానీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రియుడు దక్షిత్ పటేల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆమె మొబైల్ ఫోరెన్సిక్ విభాగానికి పంపి మరిన్ని మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, హనీషా తండ్రి అనంతపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత బుగ్గయ్య చౌదరి. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తరువాత, అనంతపురానికి తరలించగా, ఆమె స్నేహితులు, బంధువులు నివాళులు అర్పించారు. కుమార్తె మృతదేహం వద్ద బుగ్గయ్య గుండెలవిసేలా విలపించారు. ఏపీ మంత్రి పరిటాల సునీత.. హనీషా మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి బుగ్గయ్య కుటుంబాన్ని ఓదార్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles