తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయనతో పాటు వున్న ఎమ్మెల్యే దివాకర్రావుకు కూడా ముప్పు తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించడంతో వారికి ఎలాంటి ప్రాణాపాయం బారిన పడకుండా పక్కకు తీసుకురాగలిగారు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో బిసి సంక్షేమ హాస్టల్ భవన నిర్మాణానికి మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే దివాకర్రావు భూమి పూజ చేశారు.
దీంతో మంత్రి తమ గ్రామానికి వచ్చి అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడంతో అనందంతో సంబరంగా వున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పటాసలు పేల్చారు. ఇంతలో మంత్రి అక్కడి నుంచి పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుని అక్కడ సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న క్రమంలో మరోమారు కార్యకర్తలు పటాసులు పేల్చారు. అయితే టపాసులు మరీ ముఖ్యంగా తారాజువ్వలు రివ్వును ఎగిరి గాల్లోకి వెళ్లి పేలిపోయాయి. అయితే వాటికి ఇంకా నిప్పు వుండటంతో అవి ఏకంగా బహిరంగ సభావేదికలోని టెంట్లపై పడ్డాయి.
దీంతో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. మంటలను చూసిన అహుతులు టెంట్ కింద నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందని మంత్రి, ఎమ్మెల్యే అశ్చర్యంగా చూస్తున్నంతలో మంటలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో హుటాహుటిన అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మంత్రి రామన్నతో పాటు ఎమ్మెల్యేను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కాగా, ఇది టపాసుల వల్ల కాదు విద్యుద్ఘాతంలో షామియానాకు మంటలు అంటుకున్నాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాగా షామియానా, వేదిక, కుర్చీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంత్రి, ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడటంతో కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more