శతాబ్ద కాలానికి పైగా మూడు రాష్ట్రాల మధ్య వివాదానికి అజ్యం పోసిన కావేరీ నదీ జలాల ఫంఫిణీ విషయంలో ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. మరీ ముఖ్యంగా కర్ణాటకకు, తమిళనాడు రాష్ట్రాలకు మధ్య సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు బంధుత్వాలను కూడా కలుపుకునేందుకు అయిష్టతను వ్యక్తం చేసేంతగా కావేరీ నదీ జలలా విషయంలో వివాదమే కారణమైంది. అయితే ఈ విషయంలో తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు. నదులపై తమ అదిపత్యం కొనసాతుందని ఏ రాష్ట్రం చెప్పడానికి అర్హత లేదని. జలాలపై తమకే ఓనర్ షిఫ్ హక్కులు వున్నాయని వాదించడం సహేతుకం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా తీర్పు సందర్భంగా స్పష్టం చేశారు.
తమిళనాడుకు 177.25 టీఎంసీల జలాలు కేటాయించగా, కర్ణాటకకు 284.75 టీఎంసీల జలాలను అత్యున్నత న్యాయస్థానం కేటాయించింది. ఆ ప్రకారం కర్ణాటకకు అదనంగా 14.5 టీఎంసీల నీరు లభిస్తుంది. కేరళ, పుదుచ్చేరికి జలాల కేటాయింపుల్లో మార్పు లేదు. ట్రిబ్యునల్ గతంలో 30 టీఎంసీల జలాలు కేరళకు, 7 టీఎంసీల జలాలు పుదుచ్చేరికి కేటాయించింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. జలాల పంపకాలకు సంబంధించి కావేరీ జల వివాద ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) 2007లో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మూడు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై ఎనిమిది నెలల్లో 28 రోజుల పాటు విచారించిన సుప్రీంకోర్టు బెంచ్ ఇవాళ తీర్పును వెలువరించింది.
కాగా, దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు తమిళనాడు ప్రభుత్వానికి చెక్కెదురు కాగా, కర్ణాటక ప్రభుత్వం మాత్రం స్పందించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సర్వెన్నత న్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. అయితే పూర్తి తీర్పు పాఠాన్ని చదివిన తరువాత కానీ తాను ఈ విషయంలో ఏమీ మాట్లాడలేదనని చెప్పారు. ఇక తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే ఎంపీ నవనీత కృష్ణన్ ఇది తమ రాష్ట్రానికి ఎదురుదెబ్బేనని అన్నారు. అయితే తీర్పు పూర్తి పాఠం చదివిన తరువాత కానీ తాము ఈ విషయంలో అవగాహనకు రాలేమని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more