విభజన హామీలు అమలు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులతో ఐక్యవేదికను ఏర్పాటు చేయాలన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ ఆలోచనకు తాను మద్దతిస్తున్నానని లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. పవన్ చెప్పినట్లు ఒక గంటలో సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఎవరికీ లేదని అన్నారు. బేగంపేటలోని లోక్సత్తా కార్యాలయంలో జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతలూ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ.. సినిమాల్లో ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాన్ ను తాను అభినందిస్తున్నానని జయప్రకాశ్ నారాయణ అన్నారు. మనల్ని పెంచిన సమాజానికి తిరిగి మనం కూడా ఏదైనా చేయాలన్న బలమైన ఆకాంక్ష ఉంటేనే అది సాధ్యమని కొనియాడారు. దేవుడి పెళ్లికి ఊరంతా పెద్దలే అన్నట్లు కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ సాధించుకునే వేదకకు అందరూ పెద్దలేనని, స్వచ్చందంగా అందరూ ముందుకు రావాలని జేపీ పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజన విషయంలో పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించి చట్టం చేసిన తర్వాత కూడా విభజన హామీలను అమలు చేయలేదని కేంద్రంపై మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వ తీరు ఏరు దాటక తెప్ప తగలేసినట్లు వుందని జయప్రకాష్ నారాయణ ఎద్దేవాచేశారు. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదన్నారు. విభజన హామీల అమలు కోసం వేదిక ఏర్పాటు చేయాలన్న పవన్ ఆలోచనకు తాను మద్దతిస్తున్నానని చెప్పారు. హామీలను ఏ రకంగా సాధించాలన్న అంశంపై అందరూ కలిసి చర్చిస్తామని తెలిపారు.
దిశానిర్దేశం చేయాలని కోరా: పవన్
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చలేదని, కేంద్రం వాటిని నెరవేర్చేలా ఏం చేయాలో దిశానిర్దేశం చేయాలని జేపీని కోరినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. విభజన సమయలో ఆయన ఎంతో అధ్యయనం చేశారని వివరించారు. తదుపరి భేటీ వివరాలను త్వరలో తెలియజేస్తానని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more