రాజధాని లేని రాష్ట్రంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్.. రాష్ట్ర విభజనతో అర్థిక లోటులోకి వెళ్లగా.. దానిని అదుకునేందుకు అన్ని విధాలగా సహకరిస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా రాష్ట్ర పర్యటనలు చేసిన ప్రకటించిన నరేంద్రమోడీ.. ఇప్పుడు తన హామీలను నిలబెట్టుకోవాలని అంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సాక్షిగా డిమాండ్ చేశారు. కేంద్రం బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పార్లమెంటు బయటా.. లోపలా ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్ర ఎంపీలు పార్టీల వారీగా విడిపోయి తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు.
విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన హామీలు, ప్రయోజనాలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ‘మాకు న్యాయం చేయండి.. ప్రధాని స్పందించాలి’ అంటూ నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు చేతబట్టారు. విభజనతో నష్టపోయిన రాష్టానికి అరకొర నిధులతో అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అన్యాయమైన రాష్ట్రానికి మళ్లీ అన్యాయం చేయవద్దని కోరారు. విభజన హామీలు నెరవేర్చకపోతారా అని చూస్తుంటే.. నాలుగేళ్లుగా నిరాశే ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో కాంగ్రెస్..
రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేరుస్తామని ప్రజలకు సార్వత్రిక ఎన్నికలకు ముందు హామీలను గుప్పించి.. గత నాలుగేళ్లుగా వాటి ప్రస్తావనే లేకుండా.. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకుండా, బడ్జెట్ లో కేటాయింపులు జరపడంపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు సభ్యులు ఆందోళన చేపట్టారు. కేవీపీ రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలకు అడ్డుతగలొద్దని, సభ నిర్వహణకు సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కాంగ్రెస్ సభ్యులను కోరినా ఫలితం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయడంతో కేంద్రం విఫలమైందని సభ్యులు ఆరోపించారు. గందరగోళం నేపథ్యంలో ఉపరాష్ట్రపతి సభను 2 గంటల వరకు వాయిదా వేశారు.
స్పెషల్ స్టేటస్ అవసరం రాష్ట్రానికెంతోవుంది: నిఖిల్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కల్పించాల్సిన అవసవం ఎంతో వుందని టాలీవుడ్ యువనటుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా తాజాగా గొంతు కలిపాడు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిమానిమైన నిఖిల్.. ఈ హామీ ఎప్పుడు నెరవేరుతుందా..? అంటూ గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని, వారి అకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం కేంద్రంపై వుందన్నాడు. ఈ విషయమై ట్విట్టర్ ద్వారా స్పందించిన నిఖిల్, 'నేను కేవలం నటుడ్నే. కొంత మంది ఇవన్నీ నీకెందుకు అంటున్నారు.
అయితే ఈ మధ్యనే తాను ఓ చిత్రం షూటింగ్ లో భాగంగా అంధ్రప్రదేశ్ ని పూర్తిగా చుట్టేసివచ్చామన్నాడు. ఏపీని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే ఏపీకి నిధులు కావాలి, అలా నిధులు కావాలన్నా, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక సాయం అందాలన్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒక తెలుగువాడిగా, భారతీయుడిగా తాను రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more