గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపి పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మానియాకు పెట్టింది పునాదిగా నిలిచిన అయన సొంత రాష్ట్రంలో తన పట్టుకు చావు తప్పి కన్నులోట్టపోయిందన్నట్లుగా చేసిన కాంగ్రెస్.. అక్కడి ప్రజలు అందించిన అదరణతో నూతన జవజీవాలను అందిపుచ్చుకుంది. ఆ తరువాతే కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికార పగ్గాలను అందిపుచ్చుకున్న రాహుల్ గాందీ కూడా బీజేపిపై తనదైన శైలితో విమర్శలు చేస్తూ.. బీజేపి ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని ఇరుకున పెడుతున్నారు.
ఇక అదే జోష్ లో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో రాష్ట్ర నుంచి కూడా మహాదారణ లభిస్తుంది. అదే రాజస్తాన్. గుజరాత్ తో హోరాహోరీ పోటీనిచ్చి ప్రధాని మోదీకి చెమటలు పోయించిన కాంగ్రెస్ కీలకమైన రాజస్థాన్ లోనూ తన సత్తా చాటుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
రాజస్థాన్, పశ్చిమబెంగాల్లోని పలు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా రాజస్థాన్ లోని ఆళ్వార్, అజ్మీర్ ఈ రెండు లోక్ సభ స్థానాలను గతంలో బీజేపీయే కైవసం చేసుకోగా, తాజాగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీలో ఉన్నారు. అళ్వార్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ యాదవ్ 10,000 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. అజ్మీర్ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రఘు శర్మ 8,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
అయితే, ఇదే రాష్ట్రంలోని మండల్ గఢ్ అసెంబ్లీ స్థానంలో మాత్రం బీజేపీ అభ్యర్థి 3,072 ఓట్ల మెజారిటీతో ఉండడం కాస్తంత ఊరట. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల ముందు జరిగే వీటిని సెమీ ఫైనల్స్ గా భావిస్తారు. అటువంటి చోట కాంగ్రెస్ సత్తా చాటడం బీజేపీ వ్యతిరేక పవనాలను సూచిస్తోంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ లోని ఉలుబేరియా లోక్ సభ స్థానంలో తృణమూల్ ముందంజలో ఉంది. ప్రస్తుతం ఈ స్థానం తృణమూల్ కోటాలోనే ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన నోపర అసెంబ్లీ స్థానంలోనూ తృణమూల్ అభ్యర్థే ముందంజంలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more