ఈ మధ్యకాలంలో దొంగలు మరీ పేట్రేగిపోతున్నారు. కొత్త కొత్త మార్గాలను ఎంచుకుని మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. సాధారణంగా దారిదోపిడీలు, ఇంటి తాళాలు పగులగొట్టి దోపిడిల నుంచి చైన్ స్నాచింగ్ లు, బ్యాంకుల వద్ద మాటు వేసి క్యాష్ బ్యాగ్ లాక్కుని వెళ్లే ఘటనలు మాత్రమే చూసిన ప్రజలకు.. ఏటీయం కేంద్రాల వద్ద మాటు వేసి దొపిడీలు కూడా ఈ మధ్యకాలంలో చూశారు.
అయితే మధ్యప్రదేశ్ లో ఇంకొత్త తరహాలో దోపిడీ జరిగింది. డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. జనవరి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఓ భర్త తన భార్య, చిన్నారితో కలసి రాత్రి 8:30 గంటల సమయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీయంకు వెళ్లి డబ్బు డ్రా చేశారు. వాళ్లను గమనించిన ఓ ముసుగు వేసుకున్న ఓ వ్యక్తి కూడా ఏటీఎంలోకి ప్రవేశించాడు. అదను చూసి వారిని తుపాకీతో బెదిరించాడు.
ఈ హఠాన్పరిణామం చూసి బెదిరిపోయిన భార్యభర్తలు అందోళనకు గురయ్యారు. దీంతో భర్త తన చేతిలోని డబ్బు తీసి ఇచ్చినా వదల్లేదు. చిన్నారి తలకి తుపాకీ గురిపెట్టి.. ఏటీయం నుంచి డబ్బులు తీసి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బులను డ్రా చేసి మరీ ఆ దుండగుడికి ఇచ్చాడు. డబ్బులు తీసుకుని ఆ దుండగుడు పరారయ్యాడు. ఈ ఘటనంతా ఏటీయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more