కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులలో కలకలం రేగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు నడిచి వెళ్లేందుకు వినియోగించే రెండు మార్గాలలో ఒకటైన శ్రీవారి మెట్టు మార్గంలో భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభ్యంకావడం భక్తులలో అందోళనకు కారణమైంది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో ముమ్మర భద్రతా ఏర్పాట్లు వున్నా.. శ్రీవారి మెట్టు దారిలో పేలుడు పదార్థాలు దర్శనం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
శ్రీవారి మెట్ల దగ్గరి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన సోదాల్లో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో తిరుమలలోని భద్రతలో విభాగాల డొల్లతనం మరోమారు బహిర్గతమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఈ ప్రాంతంలో పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక్కడికి పేలుడు పదార్థాలను తరలించిన దుండగులు ఎవరన్న విషయమై కూడా పోలీసులు అరా తీస్తున్నారు. వీటిని ఎక్కడి తరలించాలని వారు బావించారన్న విషయమై కూడా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
టాస్క్ఫోర్స్ పోలీసుల సోదాల్లో పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించే కెపాసిటర్లు, కండెన్సర్లు, సర్క్యూట్ బోర్డులు లభ్యమయ్యాయి. ఈ పదార్థాలు అత్యంత ప్రమాదకరమైనవని కావడం కూడా భక్తులను తీవ్ర అందోళనకు గురిచేస్తుంది. గతంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి జరగడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. బాంబు తయారీకి ఉపయోగపడే పదార్థాలే కావడంతో విస్తృతంగా పరిశీలన జరిపారు. ఘటనా స్థలానికి ఐజీ కాంతారావు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అసాంఘిక శక్తులెవరైనా ఈ పదార్థాలను ఇక్కడికి తెచ్చారా? అనే కోణంలోనూ విచారణ చేపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more