'పద్మ' పురస్కారాల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకం చేశామని ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు ఎవరి సిఫార్సులూ అవసరం లేకుండానే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. కేంద్రం తనకు ప్రకటించిన అవార్డును ఓ అద్యాత్మిక గురువు సున్నితంగా తిరస్కరించారు. ఈ స్వామీజీ అవార్డును తిరస్కరించడంతో.. ఇప్పుడు కొత్తగా మరో అంశం చర్చకు దారితీసింది.
చాలా మంది సామాన్యులకు అవార్డులను దగ్గర చేశామని ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేసిన క్రమంలో అద్యాత్మిక వేత్తలకు అవార్డులను అందజేయడం.. దానిని వారు స్వీకరించడం కూడా ప్రధాన చర్చకు తెరలేపింది. పేర్లతో సంబంధం లేకుండా వారు చేసిన సేవలను చూసి మాత్రమే విజేతలను ఎంపిక చేశామని ప్రధాని చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటున్న దేశప్రజలు.. ఆధ్యాత్మిక వేత్తలకు, సన్యాసి జీవితాలను గడుపుతున్న ప్రముఖులకు, యోగా గురువులకు అవార్డులను ప్రకటించడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇందుకు ప్రధాన కారణం కర్ణాటకలోని అద్యాత్మిక గురువు కేంద్రబిందువుగా మారారు. ఆయన ఏకంగా తనను వరించిన 2018 ఏడాదికి కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు. కర్ణాటకకు చెందిన ఆధ్యాత్మిక వేత్త, జ్ఞాన యోగాశ్రమ స్వామీజీ సిద్ధేశ్వర్ స్వామికి పద్మశ్రీ ప్రకటించింది కేంద్రం. అయితే సదరు స్వామీజి మాత్రం ఈ అవార్డును సున్నితంగా తిరస్కరించారు.
ఈ మేరకు ఆయన తన తిరస్కారాన్ని తెలియపరుస్తూ.. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. తానొక సన్యాసి అని.. ఏ పురస్కారాలు, గౌరవాలపై తనకు మక్కువ లేదని, ఇలాంటివాటిపట్ల తనకు ఇష్టం చాలా తక్కువని అందుచేతే తనకు ఈ అవార్డులు అక్కర్లేదని సూచించారు. ఈ తరహా అవార్డులకు చాలామంది అర్హులైన ప్రముఖులున్నారని, వాళ్లని గౌరవించండని సూచించారు.
ఈ మేరకు తాన తీసుకున్న నిర్ణయాన్ని అటు కేంద్రంతో పాటు ఇటు ప్రధాని మోడీ స్వాగతిస్తారని కూడా అశిస్తున్నట్లు లేఖతో పేర్కోన్నారు. ఇప్పుడు ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అవార్డులను ప్రకటించే కమిటీలు అధ్యాత్మిక వేత్తలను, సన్యాసులను, యోగా గురువులను ఎంపిక చేయడం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతంది. సన్యాసులమని, తమకు ధన, కనక, వస్తు, వాహనాలపై మోజు వుండదని చెప్పే ప్రముఖులు పద్మశ్రీలను ఎందుకు స్వీకరిస్తున్నారన్నదే చర్చనీయాంశంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more