హుద్దూత్ తుఫాను విలయతాండవంతో కాకావికళమైన విశాఖపట్నంలో పర్యటించి.. అక్కడి వారికి తాను వున్నానంటూ ధైర్యాన్ని అందించి.. బిజీగా వున్న జనసేన అధినేత సీనీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్.. మీడియా ద్వారా జీవన్మరణాల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారి.. తనను చూడాలన్న అఖరు కొరికను వ్యక్తం చేసిందని తెలుసుకున్నారు. అంతే విశాఖ నుంచి నేరుగా ఖమ్మం అసుపత్రికి చేరకునేందుకు అప్పటికప్పుడు ఆయన ప్లాన్ చేసుకున్నారు.
మార్గమధ్యంలో తాను ప్రయాణిస్తున్న కారులో సాంకేతిక లోపం తలెత్తినా.. వెనుకంజ వేయలేదు.. చిన్నారిని చూడాలని, అమెను కలవాలని, అమెకు మనోధైర్యాన్ని ఇవ్వాలని సంకల్పంచిన పవన్.. అమెను చూసేందుకు మరో కారును తెప్పించుకుని మరీ అసుపత్రికి వెళ్లారు. అక్కడ చిన్నారి శ్రీజను అప్యాయంగా పలకరించి.. నేను వచ్చాను.. నీకేం కాదు.. ధైర్యంగా వుండి. మనోధైర్యమే పరమౌషదం అంటూ చెప్పాడు.
శ్రీజ తల్లిదండ్రులను కూడా పరామర్శించిన పవన్ వారికి వైద్యఖర్చుల నిమిత్తం అర్థిక సాయాన్ని అందించాడు. చిన్నారికి పలు వస్తువులను బహుమతిగా ఇచ్చాడు. 2014 అక్టోబర్ లో ఇది జరిగింది. కట్ చేస్తే ఆ తరువాత శ్రీజ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత తన తల్లిదండ్రులను వెంటబెట్టుకుని పవన్ కల్యాన్ ను చూడటానికని హైదరాబాద్ కు వచ్చింది.
ఇక మళ్లీ ఇన్నాళ్లు పవన్ తమ పట్టణానికి వస్తున్నాడని తెలిసిన శ్రీజ తన తండ్రితో పాటు కొత్తగూడెం చేరుకుంది. శ్రీజను చూసిన పవన్ అమెను అప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. శ్రీజతో ఆప్యాయంగా మాట్లాడి దగ్గర చేర్చుకున్న పవన్ కల్యాణ్, ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తన చదువులకు, భవిష్యత్తుకు అల్ ది బెస్ట్ చెప్పారు. కాగా, ఇవాళ పవన్ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆపై ఆయన తొలి దశ తెలంగాణ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more