సగం ధరకే ద్విచక్రవాహనాలను అందజేస్తామని ప్రకటన ఇచ్చి కౌంటర్లను ఏర్పాటు చేసినా.. తమళనాడులో మహిళలు పెద్దగా అసక్తిని కనబర్చడం లేదు. ఇందులో కూడా ఏదైనా మోసం వుందా..? అందుకనే వారు వెనకంజ వేస్తున్నారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయా.? అదేం లేదు. ఇది ఏకంగా ప్రభుత్వమే ఇస్తున్న పథకం. మరోలా చెప్పాలంటే.. మరోమారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేందుకు తాము 50 శాతం రాయితీని కల్పిస్తామని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎన్నికలకు ముందు 2016 మే 4న ప్రకటించారు.
అయితే అమ్మ మరణం తరువాత పార్టీ పాలన సాగిస్తున్నా.. అదరణ మాత్రం కరువైందన్న వార్తల నేపథ్యంలో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24 అమ్మ జయంతిని పురస్కరించుకుని అమ్మ అమలు చేయని ఎన్నికల హామీని అమలు చేయాలని సంకల్పించింది. రాష్ట్రంలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు సగం ధరకే ద్విచక్ర వాహనాలను 'అమ్మ బైక్'ల పేరిట అందించే వినూత్న పథకం ప్రకటించింది. ఈ పథకం ద్వారా బైక్ లను తీసుకోదలచిన వారు ఫ్రిబవరి 5 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కూడా తెలిపింది. అయితే ఇందుకు మహిళల నుంచి స్పందన కరవైంది.
ప్రతి జిల్లా, మండలాల్లో దరఖాస్తులు స్వీకరించే శిబిరాలు ఏర్పాటు అయినా మహిళలు మాత్రం స్పందించలేదు. దీనికి అధికారులు పెట్టిన కండీషన్లే కారణం. ఈ టూవీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధన పలువురి ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు సర్టిఫికెట్, 40 ఏళ్లలోపు వయసున్నట్టు ధ్రువీకరణను అధికారులు అడుగుతున్నారు. బండ్లే లేని తాము డ్రైవింగ్ లైసెన్సులు ఎందుకు తీసుకుంటామని ప్రశ్నిస్తున్న అమ్మాయిలు, అసలు బైకులను ఎవరికి ఇవ్వాలని చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more