అవినీతి వ్యతిరేక ప్రభుత్వం అధికరాంలోకి వచ్చింది.. ఇక దేశ ప్రజలు ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా తమ పనులు జరుపుకోవచ్చునని.. ఇలాంటి ప్రభుత్వం మీ రాష్ట్రంలోనూ కావాలంటే మీరు బీజేపి పార్టీకే ఓటువేయాలని పదే పదే పలు రాష్ట్రాల్లో ప్రచారం చేసిన ప్రధాని నరేంద్రమోడీ.. అదే అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త అన్నాహజారే విషయంలో మాత్రం స్పందించడమే మానేశాడు. దేశీయ వ్యవస్థలో అనినీతి పేరుకుపోయిందంటూ ఉద్యమించిన అన్నాకు ప్రధాని నుంచి అదరణ కూడా కరువైంది.
ఎక్కడో దేశంలోని ఏ మారుమూల నుంచో చిన్నారులు తనకు లేఖలు రాస్తే వాటిపై స్పందించే ప్రధాని నరేంద్రమోడీ వారు అభ్యర్థించిన అంశాలను యుద్దప్రాతిపదికన అమలయ్యేలా చర్యలు తీసుకుంటూ ఇలాంటి ప్రధానులు రావాలి, కావాలి అని యావత్ భారతం కోడై కూసి.. నెట జనుల ప్రశంసలను అందుకున్నారు. అయితే కేరళ నుంచి ఓ పదో తరగతి విద్యార్థిని ప్రధానికి మాదకద్రవ్యాలను దేశంలో నిషేధించాలని కోరిన తరుణంలో మాత్రం రెండేళ్లు గడుస్తున్నా స్పందన లేదు. ఈ విద్యార్థిని విషయాన్ని పక్కనబెడితే సామాజిక కార్యకర్త అన్నాహజారే అంశంలోనూ ప్రధాని అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు.
ఈ మేరకు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీపై అన్నా తీవ్రస్థాయిలో అగ్రహాన్ని వ్యక్తం చేశారు. నరేంద్రమోడీలో తాను ప్రధానమంత్రి అన్న అహంభావం పేరుకుపోయిందని మండిపడ్డారు. దేశీయ వ్యవస్థలో అవినీతి పెరిగిపోతుందని, దానిని అరకట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు తాను గత మూడేళ్ల నుంచి మోదీకి 30కి పైగా లేఖలు రాశానని... అయినా ఒక్క లేఖకు కూడా ఆయన బదులు ఇవ్వలేదని అన్నారు. తాను 'ప్రధానిని' అనే అహంకారం ఆయనలో నరనరాన జీర్ణించుకుపోయిందని విమర్శించారు.
తాను సామాజిక కార్యకర్త లేఖలు ఎందుకు బదులివ్యాలన్న ధోరణి, అహంకారం వల్లే నరేంద్రమోడీ తన లేఖలకు స్పందించలేదని అన్నారు. మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా అట్ పడీలో ప్రజల మద్దతు కోసం ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, మార్చి 23 నుంచి మరోమారు దేశ రాజధాని న్యూఢిల్లీలో అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పాటు రైతు మద్దతుగా నిరసనను తెలియజేస్తామని అన్నారు. ఇలాంటి ప్రజాఉద్యమం ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలా వుంటుందని అన్నారు. అయితే తన ఉద్యమాల నుంచి మరో అరవింద్ కేజ్రీవాల్ మాత్రం పుట్టుకురాడని కూడా అన్నాహజారే ఇదివరకే చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more