భారత అర్మీ పాకిస్థాన్ తీవ్రవాదులపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. నలుగురు భారత అర్మీకి చెందిన జవాన్లను దొంగదెబ్బ తీసి హతమార్చిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ సంస్థకు చెందిన తీవ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునే దిశగా కదిలిన భారత రక్షణ బలగాలు ఓ అడుగు ముందుకేసీ మరీ పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లోకి చోచ్చుకెళ్లి మరి మతమార్చాయి. దీంతో భారత్ - పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ల మధ్యలో గల నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది.
భారత అర్మీపై దొంగచాటుగా కాల్పులకు తెగబడుతున్న జైష్-ఏ-మహ్మద్ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఎల్వోసీని దాటి వెళ్లి మరీ భారత ఆర్మీ హతమార్చింది. గత శనివారం పాకిస్తాన్- భారత నియంత్రణ రేఖ వెంబడి రాజౌరీ వద్ద గస్తీ కాస్తున్న భారత అర్మీకి చెందిన నలుగురు సైనికులపై జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో నలుగురు భారత ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోకి భారత ఆర్మీ బలగాలు చొచ్చుకెళ్లినట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారు.
భారత్ ఆర్మీ ఎల్వోసీలోకి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలో కాల్పులు జరిగాయి. భారత అర్మీ ధీటుగా సమాధానం ఇవ్వడంతో.. ఈ కాల్పుల్లో జైషే ఈ మహ్మద్ టాప్ కమాండర్ నూర్ మహ్మద్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోనే నక్కిన మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం దళాలు జల్లెడ పడుతున్నాయి. కాగా, భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ పై పాకిస్తాన్ మీడియా మాత్రం వక్రబాష్యంగానే కథనాలను ప్రకటనను వెలువరించింది. నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు పాకిస్తాన్ సైనికులను చంపినట్లు పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more