రాజస్థాన్ లో జరిగిన ఘోర ప్రమాదానికి కారణం 16 ఏళ్ల కుర్రాడు. డ్రైవర్ నిర్లక్ష్య ధోరణి కారణంగా 16 ఏళ్ల కుర్రాడికి బస్సు నడిపేందుకు అనుమతించడంతో 32 మంది బలయ్యారు. ఇవాళ ఉదయం తీర్థయాత్రకని వెళ్లి వస్తున్న బస్సును నడిపిన 16 ఏళ్ల కుర్రాడు.. బస్సు కండక్టర్ గా పనిచేస్తున్నాడని పోలీసుల ప్రాథమిక సమాచారంలో తేలింది. సవాయ్ మాధోపూర్ దుబి ప్రాంతంలో వంతెనపై నుంచి ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి వంతెన పై నుంచి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.
వంతెనపై నుంచి బస్సు వెళ్తున్నప్పుడు వేగంగా నడిపిన కుర్రాడు.. బస్సును నియంత్రించడంలో విఫలమయ్యాడు. దీంతో బస్సు అదుపుతప్పి నదిలో పడి పోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గరు గల్లంతయ్యారు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకుని సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు, రెస్క్యూ బృందాలు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
ఇవాళ తెల్లవారు జామున జరిగిన ఈ బస్సు ప్రమాదానికి కారణం.. బస్సు డ్రైవరేనని ప్రత్యక్ష సాక్షులు అరోపిస్తున్నారు. లాల్ సోత్ ప్రాంతం నుంచి సవాయ్ మాధోపూర్ కు బస్సు వచ్చిందని, ఆ బస్సును నడిపే డ్రైవర్.. 16 ఏళ్ల కుర్రాడైన కండక్టర్ని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టి బస్సు నడపమని చెప్పి, డ్రైవర్ పడుకున్నాడని పోలీసులు తెలిపారు. స్టీరింగ్ అదుపు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.
కాగా ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ కూడా మరణించారని పోలీసులు తెలిపారు. ఈ బస్సు ప్రమాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని అన్నారు. ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు మొదలు పెట్టిందని ట్వీట్ చేశారు.
Anguished by the bus accident in Rajasthan's Sawai Madhopur district. My thoughts are with the families of the deceased. State Government is closely monitoring the situation, including rescue operations and providing all possible assistance to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 23, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more