గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో తన పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తుందని తెలిసిందో ఏమో తెలియదు కానీ.. మరింత ముందుకు వచ్చేందుకు తనకు తెలిసిన ప్రయత్నాలు చేసిన కేంద్రమంత్రి నెట్ జనుల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది. జీఎస్టీ మూలంగా అకౌంటెంట్స్ ఉద్యోగాలకు యమ డిమాండ్ పెరిగినట్లు ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్’ వెల్లడించిందంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన ట్వీట్ పై వరుసగా వ్యంగ్య ట్వీట్లు పేలుతున్నాయి.
కేంద్రమంత్రి ట్విట్ ను విమర్శిస్తూ నెట్ జనులు తమదైన శైలిలో విమర్శలు సందిస్తున్నారు. పెనుభూకంపం వస్తే పలు భవనాలు కూలిపోతాయని, అప్పుడు భవన నిర్మాణ రంగంలో భారీగా ఉద్యోగాలు పెరుగుతాయని అన్నట్లు ఉందని కొందరు వ్యంగంగా వ్యాఖ్యానించారు. ఇరానీ పేరును ట్యాగ్ చేస్తూ ఇదేమి ఐరనిరా బాబూ! అంటూ కొందరు, డెంగ్యూ రావడం వల్ల ప్రైవేట్ ఆస్పత్రులకు డిమాండ్ పెరిగిందన్నట్లు ఉందని మరికొందరు వ్యంగ్యోక్తులు విసిరారు.
టెర్రరిస్టులు ప్రజలను చంపడం వల్ల శ్మశానంలో కార్మికుల సంఖ్య పెరుగుతుందని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ప్రమాదాల వల్ల ఆస్పత్రుల వ్యాపారం పెరుగుతుందని, అగ్నిమాపక ప్రమాదాలు జరగడం వల్ల అగ్నిమాపక దళాలకు డిమాండ్ పెరుగుతుందని, వరదల వల్ల ఎన్డీఆర్ఎఫ్లో ఉద్యోగాలు పెరుగుతాయని సంబురపడినట్లు ఉందని కొందరు నెట్ జనులు అమెను తూర్పారబట్టారు. ‘దయచేసి మీరు రాజీనామా చేయండి. మీ వల్ల కేంద్ర కేబినెట్ లో ఓ ఉద్యోగి పెరుగుతారంటూ మరొకరు మరింత ఘాటుగా స్పందించారు.
దేశంలో నకిలీ డిగ్రీలు బీజేపీకీ ఉద్యోగాల ఊపును తీసుకొచ్చిందని ఒకరు వ్యాఖ్యానించారు. స్మృతి ఇరానీపై నకిలీ డిగ్రీ వివాదం ఉన్న విషయం తెల్సిందే. జీఎస్టీ వల్ల సీఏ ఉద్యోగాలు పెరిగాయన్న విషయాన్ని యేల్ యూనివర్శిటీలో నేర్చుకున్నారా? అంటూ మరొకరు ప్రశ్నించారు. ఆ యూనివర్శిటీలో ఆమె ఆరు రోజుల డిగ్రీ చదివినట్లు వార్తలొచ్చిన విషయం తెల్సిందే. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో మీ పార్టీ నేతల మొప్పు పొందవచ్చు కానీ దేశ ప్రజలది కాదని, మరికొందరు సూచించారు. ఈ ఒక్క ట్విట్ అమెకు ముఖ్యమంత్రి పదవిని దరి చేరుస్తుందా..? లేక దూరం చేస్తుందా..? అన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more