టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఆయన పోస్టుమార్టం పూర్తైన క్రమంలో క్రితం రోజునే అంత్యక్రియలు కూడా నిర్వహించి తుది వీడ్కోలు పలికారు. ఈ క్రమంలో విజయ్ సాయి కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో తొలుత విజయ్ సాయి తల్లిదండ్రుల వివరణను ఇవాళ రికార్డు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నారు. అదే సమయంలో విజయ్ సాయి సెల్పీ వీడియో అధారంగా కూడా కేసును దర్యాప్తు చేయనున్నారు.
విజయ్ సాయి ఆత్మహత్య వెనుక కుటంబ కలహాలే కారణమని ఆయన వీడియో రికార్డింగ్ స్పష్టం చేస్తున్న క్రమంలో ఆయన అరోపించినట్లుగానే అయన భార్య వనిత అలియాస్ వరలక్ష్మీతో పాటు బడా కాంట్రాక్టర్ శశిధర్, వనిత విడాకుల కేసు వాదిస్తున్న న్యాయవాది శ్రీనివాస్ లను కూడా విచారించనున్నారు. ఇప్పటికే విజయ్ సాయి అత్మహత్యకు ఒక్క రోజు ముందు తమకు ఇచ్చిన పిర్యాదు కూడా పరిగణలోకి తీసుకున్న పోలీసులు ఆ రోజు అయనపై దాడికి పాల్పడిన నలుగురు రౌడీలు ఎవరనేది కూడా దర్యాప్తు చేయనున్నారు.
ఇక పోలీసుల దర్యాప్తులో వనతి వ్యవహర తీరుపై పోలీసులకు ఇప్పటికే అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. అమె పేరు వనిత కాదని, వరలక్ష్మీ అని తెలుసుకన్న పోలీసులు అమెకు ఇద్దరు తండ్రులు వున్నారన్న విషయాన్ని కూడా దర్యాప్తులో తెలుసుకున్నారు. ఇక అమె తల్లి కూడా రఫీ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుందని కూడా కనుగొన్నారు. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనితతో పాటు శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ లకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.
వనితపై విజయ్ సాయి తండ్రి అరోపణలు
విజయ్ సాయి భార్య వనిత అలియాస్ వరలక్ష్మిపై ఆయన తండ్రి ఇవాళ అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయినంత మాత్రాన.. భర్త అంత్యక్రియలకు భార్య హాజరుకాకుండా వుంటుందా..? అని అయన ప్రశ్నించారు. భర్తపై అమెకు ఎంత ప్రేమ ఉందో దీని బట్టే అర్థమవుతుందని అన్నారు. విజయ్ సాయితో వున్నంత కాలం అమె కేవలం డబ్బునే ప్రేమించిందని, విడాకుల కోసం కోర్టుకు వెళ్లినా.. డబ్బు, బంగారు నగలను తీసుకెళ్లిపోయిందని అరోపించారు. ఇక తండ్రి కడసారి చూపులకు కూడా కూతుర్ని దూరం చేసిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more