ఉత్తర భారతదేశంలో మహిళలు, అడపిల్లలపై అత్యాచారాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతున్న నేపథ్యంలో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న పాలకపక్షం ఎట్టకేలకు నూతన చట్టాన్ని తీసుకువచ్చేందుక ఉపక్రమించింది. దీంతో నూతన బిల్లును రూపోందించిన ప్రభుత్వం దానిన అసెంబ్లీలో పెట్టి అమోదింపజేసింది. దీంతో ఇకపై ఈ రాష్ట్రంలో పన్నెండేళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి ఇక ఉరి శిక్ష విధించనుంది.
ఈ మేరకు ఇవాళ మధ్యప్రదేశ్ శాసనసభ ఓ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ తీర్మాణాన్ని ఇక కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. దీనిని ఉభయ పార్లమెంటు సభలు అమోదించిన పిమ్మట రాష్ట్రపతి కూడా అమోదం తెలిపిన తరువాత బిల్లు చట్టరూపం దాల్చుతుంది. దీంతో 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడినట్లైతే కనీసం 14 ఏళ్ల జైలు శిక్ష లేదా మరణించేంతవరకు జీవిత కాలపు శిక్ష విధిస్తారు. గ్యాంగ్ రేప్కు పాల్పడితే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేటట్లు ఈ బిల్లు రూపొందించారు.
అలాగే బాలికలపై వేధింపులకు పాల్పడినా జైలు శిక్ష మరింత కఠినంగా విధించేటట్లు బిల్లుకు రూపం ఇచ్చారు. ఈ బిల్లు గురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారు మనుషులు కారని, వారు దయ్యాలతో సమానం అని వ్యాఖ్యానించారు. వారికి జీవించే హక్కు లేదని అన్నారు. పదే పదే వేధింపులకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠినమైన శిక్షలు విధిస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more