పొట్ట చేత బట్టుకుని పరాయిదేశానికి వెళ్లినా.. తన పనేదో తాను చూసుకోకుండా చేయకూడని పాడు పనులు చేస్తూ.. దేశం పరువుతీస్తున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో భారీగానే పెరుగుతుంది. తాజాగా భారత్కు చెందిన 21 ఏళ్ల యువకుడు యూనైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లోని దుబాయ నగరంలో నీచమైన పనికి పాల్పడి ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నాడు. పొట్టకూటి కోసం వెళ్లి పాడు పనిచేస్తూ పట్టుబడి పడరాని పాట్లు పడుతూ.. కన్నవాళ్లకు కూడా కష్టాలను తెచ్చిపెట్టాడు.
ఇంతకీ భారతీయ యువకుడు చేసిన పాడుపని ఏంటంటే.. తాను పనిచేస్తున్న అదే కంపెనీలో తన సహోధ్యోగిగా పని చేస్తున్న మరో దేశానికి చెందిన మహిళను నగ్నంగా తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు. కెమెరా పై లైటు పడి అది తన ముందున్న అద్దంలో ప్రతిభింభించడంతో యువకుడు ఈ పని చేయడాన్ని గమనించిన యువతి..షాక్ కు గురైంది. వెంటనే తేరుకుని సహోధ్యోగుల మద్దతుతో యువకుడ్ని పోలీసులు అప్పగించింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫిలిప్పైన్స్ కు చెందిన ఓ 28 ఏళ్ల యువతి అఫీసు పనులు ముగించుకుని ఇంటికెళ్లేందుకు సమాయత్తం అవుతూ బయలుదేరే ముందు కంపెనీలోని వాస్ రూంకు వెళ్లింది. అదే కార్యాలయంలో కర్ల్క్ గా విధులు నిర్వహిస్తున్న భారతీయ యువకుడు దీనిని గమనించి... పక్కనే ఉన్న మరో రూం నుంచి యువతి వాష్ రూంలోకి తొంగిచూశాడు. తన వద్ద ఉన్న సెల్ ఫోన్ తో మహిళను నగ్నంగా చిత్రీకరించడం మొదలుపెట్టాడు.
వాస్ రూంలోని అద్దంపై సెల్ ఫోన్ ప్రతిబింబం మెరపడడంతో విషయాన్ని యువతి గమనించి..షాక్ కు గురైంది.. వెంటనే తేరుకుని నిందితుడిని తిట్టేసింది. ఏడ్చుకుంటూ విషయాన్ని తోటి సిబ్బందికి తెలిపింది. దీంతో కార్యాలయంలోని సహుద్యోగులందరూ కలసి అతడి వద్ద నుంచి సెల్ ఫోన్ తీసుకున్నారు. విషయాన్ని ఎవరికీ పంపించకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం వీడియోలను డిలీట్ చేశారు. అయితే గతంలో అదే కార్యాలయంలో మహిళా సిబ్బంది వీడియోలు కూడా తీసివుంటాడన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందని అల్ రఫా పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more