తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు స్వామి వారి దర్శనం కాకుండానే అక్కడి హోటల్ యాజమాన్యాలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. హోటళ్ల నిలువుదోపిడీపై ప్రజాసంఘాలు వేసిన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేశాయి. దీంతో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కొండమీద వివిధ హోటళ్లలో అడ్డగోలు ధరలకు భక్తులు నిలుపు దోపిడీకి గురికాక తప్పని పరిస్థులేర్పడ్డాయి. పెద్ద హోటళ్లే కాదు.. చివరకు చిన్న చిరు దుకాణాల్లోకి వెళ్లినా.. భక్తులు జేబులు గుళ్ల కావాల్సిందే. దీంతో తిరుమల కోండకు రావడం కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్న పనైపోయింది.
హైకోర్టు ఈ నెల తొలినాళ్లలో ఓ పిటీషన్ విచారించి.. ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓనే న్యాయస్థానానికి రావాల్సిందిగా సమన్లు జారీ చేయడంతో.. అఘమేఘాల మీద పరుగులు పెట్టిన టీటీడీ ఈ వో జే శ్రీనివాసరాజు.. పెద్ద హోటళ్ల నుంచి చిరుతిళ్ల దుకాణాల వరకు అందరినీ పిలిచి సమావేశపర్చి.. ఇకపై తిరుమలలో ఫిక్సిడ్ రేట్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో రూ.30 పలికిన రెండు ఇడ్లీలు ఇక రూ.7 దర పలకనున్నాయి. ఇలా అన్ని పలహారాలు, బోభనాలపై కూడా రేట్లు తగ్గిపోయాయి. ఈ ధరలను పట్టిక రూపంలో ప్రతీ దుకాణం వ్దద వుంచాలని, లేనిపక్షంలో దుకాణదారులపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చిరించారు.
తిరుమలలో సామాన్య భక్తులకు సాంత్వన చేకూరేలా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో హోటల్ యజమానులు అధిక ధరలను తగ్గించాలని, ఆయా ధరల పట్టికలను హోటళ్ల ముందు అందరికీ కనిపించేలా వేలాడదీయాలని, దీన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతం తిరుమలలోని ప్రతి చిన్న హోటల్లోనూ ధరల తగ్గి, పట్టికలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పట్టికలో వున్న రేట్ల కంటే ఎక్కువ ధరకు అమ్మితే... ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించేలా ఫోన్ నెంబర్లు వేస్తున్నారు. దీంతో వెంకన్న భక్తులు తిరుపతి కోండకు పోవచ్చు మళ్లి.. కాకుండా జేబులు గుళ్ల అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more