పవిత్ర కార్తీకమాసంలో శివనామస్మరణ చేస్తే పునర్జన్మ లేకుండా పోతుందని భక్తుల అచెంచల విశ్వాసం. దీంతో ఏడాది పోడవునా ఆలయాలకు వెళ్లని భక్తులు కూడా కార్తీక మాసంలో శైవక్షేత్రాలతో పాటు వైష్ణవాలయాలకు తరలివెళ్లి అక్కడి భక్త శ్రధ్దలతో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక కార్తీకమాస వైశిష్ట్యం గురించి, పవిత్రత, ఫలాలు ఎలా వుంటాయన్న విషయాలను ఇప్పటికే అనేకానేక మంది పండితులు అనేక మాద్యమాల ద్వారా ప్రచరిచిస్తూ వుంటారు.
ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున తెల్లవారు స్యూరోదయానికి ముందుగానే లేచి స్నానాదులు అచరించి.. ఇంట్లోని తులసికోటలో ఉసరి కొమ్మను ఏర్పాటు చేసిన .. రోజుకక్కటి చోప్పున మొత్తంగా 365 ఒత్తులను వెలిగించి ఆ పరమేశ్వరుడ్ని చల్లగా చూడాలని కోరని భక్తులు వుండరు. అయితే భక్తుల అంచెలమైన విశ్వాసాలపై హైందవత్వానికి చెందిన ఓ స్వామీజీయే భక్తుల నమ్మకాలపై నీళ్లు చల్లే విధంగా వ్యవహరించారు. అదేమంటే వీరశైవ విధానమని తన శిష్యబృందంతో సెలవిప్పించారు.
కాగా స్వామీజీ చేసిన నిర్వాకంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతటి స్వామీజీ అయినా తాను దైవం కన్నా ఎక్కువ అని భావించరాదని, తానే దైవం అని కూడా భావించరాదని భక్తులు సూచిస్తున్నారు. ఇక స్వామీజీ చెప్పినట్లుగా ఏ విధానంలోనూ ఈ తరహాలో పూజలు నిర్వహించరని తేల్చచెబుతున్నారు. అసలేం జరిగిందంటే.. కార్మీక పౌర్ణమి రోజున బెంగళూరు శివారులోని రంగనబెట్టి ప్రాంతంలో శాంతలింగేశ్వర స్వామికి చెందిన మఠం శాఖను నూతనంగా ప్రారంభించారు.
అయితే ఈ సందర్భంగా అక్కడి శివలింగాన్ని ఏర్పాటు చేసి.. ప్రాణప్రతిష్ట చేసే క్రమంలో సదరు స్వామీజీ ఏకంగా శివలింగంపై పాదాలు మోపి తన శిష్యులతో పూజలు చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వామీజీ భక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అవి కాస్తా వైరల్ గా మారి స్వామీజీపై నెట్ జనులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం ఉగాది రోజున మాత్రమే మాట్లాడే స్వామీజి.. పూజలు తమ వీరశైవ విధానం ప్రకారమే జరిగాయని తన శిష్యులతో చెప్పించారు. అయినా నెట్ జనులు మాత్రం మండిపడుతూనే వున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more