పదవ తరగతి, ఇంటర్ పస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇక తమ అటపాటపై వున్న దృష్టిని మరల్చి చదుపుపై అధికంగా ఫోకస్ చేయాల్సిన సమయం అసన్నమైంది. ఎందకంటే ఇక పరీక్షల కాలానికి సమయం అసన్నమైందని ఆయా విభాగాల అధికారులు పరోక్షంగా తెలియజేశారు. ఇప్పటికే ఇంటర్ పస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ టైమ్ టేబుల్ ను తమ వెబ్ సైట్లో పోందుపర్చిన అధికారులు ఇవాళ తాజాగా పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేశారు.
మార్చి 15 నుంచి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 29 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల 36 వేల 831 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరకానున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2800 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా పరీక్షల ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పిన అధికారులు.. రాష్ట్రంలోని విద్యార్ధులందరూ బల్లలపై కూర్చొని పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు.
ఇక మరోవైపు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను కూడా క్రితం రోజున ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. మార్చి నెల 1వ తేదీన ప్రారంభమయ్యే ఇంటర్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలు మార్చి 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా ఫిబ్రవరి 2 నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 31న పర్యావరణం, జనవరి 29న ఎథిక్స్.. హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు జరగనున్నాయి. ఇక పూర్తి టైం టేబుల్ కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ www.bieap.gov.in.లోకి లాగిన్ అవ్యండీ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more