వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరి పదవులనుభవిస్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓ వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలంతా కోడెలను కలిసి కోరారు. దీనిపై కోడెల స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు తనను కోరారని... అయితే, దీనికోసం తాను ఓ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
తాను నిర్ణయం తీసుకోక ముందే వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారని, అక్కడ పిటిషన్ ను కొట్టివేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లారని... సుప్రీంకోర్టు దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి పంపిందని చెప్పారు. అక్కడ తీర్పు వెలువడాల్సి ఉందని... కేసు సుప్రీంకోర్టులో ఉంటే తాను నిర్ణయం ఎలా తీసుకోగలనని? ప్రశ్నించారు. ఫిరాయింపు కారణాన్ని చూపుతూ, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని వైసీపీ నేతలు చెప్పడం బాధాకరమని కోడెల అన్నారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాము అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని వారు అంటున్నారని... అయితే, ఎన్టీఆర్ తానొక్కరే అసెంబ్లీని బహిష్కరించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ అసెంబ్లీకి రాకపోయినా, టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చారని... చివరి రోజు వరకు సభలో తమ వాదనను వినిపించారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు తాను ఫోన్ చేశానని కోడెల చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more