governor inspects hyderabad metro rail works మెట్రో రైలులో ప్రయాణించి పర్యవేక్షించిన గవర్నర్

Governor inspects hyderabad metro rail works

esl narasimhan, narasimhan metro rail, governot metro rail, KTR, governor, metro rail, nvs reddy, TS cheif secretary shekar prasad, telanagana

governot esl narasimhan inspects hyderabad metro rail works by travelling in it from sr nagar to miyapur along with TS IT minister KTR, CS, shekar prasad

మెట్రో రైలులో ప్రయాణించి పర్యవేక్షించిన గవర్నర్

Posted: 11/08/2017 08:05 PM IST
Governor inspects hyderabad metro rail works

హైదరాబాద్ నగరవాసులు కల సాకారమవుతున్న వేళ.. ఈ నెలాఖరులో దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రో రైలులో ఇవాళ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ ప్రయాణించారు. ప్రధాని వస్తున్న వేళ స్వయంగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆ ఏర్పాట్లను పరిశీలించారు, మెట్రో పనులు ఎలా జరుగుతున్నాయన్న వివరాలను మెట్రో రైల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు,

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుతో కలసి.. ఇవాళ మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్‌ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైలు ఎక్కిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించారు. అక్కడ జరుగుతున్న మెట్రో పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మెట్రో రైలులో బయలుదేరి ఎస్ఆర్ నగర్ మెట్రోస్టేషన్ కు చేరుకున్నారు. గవర్నర్ తో పాటు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శేఖర్ ప్రసాద్‌ సింగ్ పాటు పలువురు అధికారులు మెట్రో రైలులో ప్రయాణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : esl narasimhan  KTR  governor  metro rail  nvs reddy  TS cheif secretary shekar prasad  telanagana  

Other Articles